Asianet News TeluguAsianet News Telugu

జస్ట్ రూ.2100 చెల్లించండి.. 4% వడ్డీకే 5 లక్షల లోన్ ! సోషల్ మీడియా వైరల్..

ప్రధాన మంత్రి ముద్రా పథకం కింద లోన్ మంజూరు అనే శీర్షికతో సోషల్ మీడియాలో అప్రూవల్ లెటర్ హల్ చల్ చేస్తోంది.ఆ ఆఫర్ చూసి చాలా మంది తలపై చేయి పెట్టుకుంటున్నారంటే..నమ్మలేరు.. అయితే ఇందులో వాస్తవం ఎంత దానిపై పిఐబి ఒక క్లారిటీ ఇచ్చింది. 
 

Pay 2100 rupees, get a loan of 5 lakh rupees at 4% interest! Is it true? Fact Check-sak
Author
First Published Jan 4, 2024, 3:15 PM IST

 పీఎం ముద్రా యోజన పథకం కింద రూ.2100 చెల్లిస్తే రూ.5 లక్షల లోన్  లభిస్తుందా ? వాట్సాప్ ఇంకా  ట్విట్టర్‌తో సహా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న పర్మిషన్ లేఖలో ఈ క్లెయిమ్ ఉంది. ఈ ఆకర్షణీయమైన లోన్  కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అందించిందని కూడా లేఖలో పేర్కొన్నారు. ఆ ఆఫర్ చూసి చాలా మంది తలపై చేయి పెట్టుకుంటున్నారంటే.. అసలు ఇందులో నిజం ఏంటో చూద్దాం...

ప్రచారం

ప్రధాన మంత్రి ముద్రా పథకం కింద లోన్ మంజూరు అనే శీర్షికతో సోషల్ మీడియాలో అప్రూవల్ లెటర్ హల్ చల్ చేస్తోంది. 'మీకు ఐదు లక్షల రూపాయల లోన్  ఆమోదం లభించింది. వడ్డీ రేటు 4 శాతం మాత్రమే. తిరిగి చెల్లించే వ్యవధిని బట్టి వడ్డీ రేటు మారవచ్చు. లోన్ పొందడానికి రూ. 2100 చెల్లించండి. ఈ మొత్తం లోన్ ప్రాసెసింగ్ ఇంకా మంజూరు కోసం అన్ని పన్నులతో కలిపి ఉంటుంది. అంటూ ఈ  లేఖతో పాటు అనేక పత్రాలు జత చేసి ఉన్నాయి. వాటిని స్పష్టంగా చదివి అర్థం చేసుకున్న తర్వాత, దయచేసి వీలైనంత త్వరగా దరఖాస్తు ఫారమ్‌ను తిరిగి ఇవ్వండి.' అంటూ  లేఖలో పేర్కొంది. 

ఫాక్ట్ 
2100 రూపాయలు చెల్లిస్తే 5 లక్షల రూపాయల లోన్  తక్కువ పైసాకే లభిస్తుందన్న ఈ ప్రచారం బూటకమన్నారు. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పర్మిషన్ లేఖ నకిలీదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్  ఈ ఆమోద పత్రాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేయలేదు అని తెలిపింది. ఈ ఆఫర్ చూసి రూ.5 లక్షల లోన్  పొందేందుకు బ్యాంకు ఖాతా వివరాలు, ఇతర వ్యక్తిగత వివరాలు, డబ్బులు అందజేసి ఎవరూ మోసపోవద్దు. ముద్రా పథకం అంటే ఏమిటో వివరంగా తెలుసుకోవడానికి అధికారిక లింక్‌పై మాత్రమే క్లిక్ చేయండి. పీఐబీ గతంలో లోన్ మోసాలపై కూడా ప్రజలను హెచ్చరించింది. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios