రిలయన్స్ రిటైల్ కు చెందిన జియోమార్ట్ మహేంద్ర సింగ్ ధోనీని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. దీనితో పాటు, వారు తమ పండుగ ప్రచారం పేరును 'జియో ఉత్సవ్, సెలబ్రేషన్ ఆఫ్ ఇండియా'ను ప్రారంభించింది. ఈ సందర్భంగా ధోనీ మాట్లాడుతూ, జియోమార్ట్ చేస్తున్న ఈ ప్రచారం భారతదేశ వేడుకలకు ప్రతీక అని, అందులో భాగమైనందుకు తాను సంతోషిస్తున్నానని అన్నారు. 

రిలయన్స్ రిటైల్ జియో మార్ట్ తన బ్రాండ్ అంబాసిడర్‌గా భారత క్రికెట్ ఐకాన్ మహేంద్ర సింగ్ ధోని ని నియమించింది. దీనితో JioMart తన పండుగ ప్రచారాన్ని 'Jio Utsav, Celebration of India'గా మార్చింది. ఈ పండుగ సేల్ అక్టోబర్ 8, 2023 నుండి ప్రారంభమవుతుంది. క్రికెట్ అభిమానులలో మహి అని పిలవబడే మహేంద్ర సింగ్ ధోని మాట్లాడుతూ "భారతదేశం దాని శక్తివంతమైన సంస్కృతి, ప్రజలు, పండుగలకు ప్రసిద్ధి చెందింది, జియోమార్ట్ , 'జియో ఉత్సవ్ ప్రచారం' భారతదేశం దాని ప్రజల వేడుకలను జరుపుకుంటుంది. నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. JioMartతో అనుబంధం కలిగి ఉండటం కోట్లాదిమంది భారతీయుల షాపింగ్ ప్రయాణంలో భాగం కావడం నాకు సంతోష దాయకం అని పేర్కొన్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

బ్రాండ్ అంబాసిడర్‌గా ధోనీని స్వాగతిస్తూ, JioMart CEO సందీప్ వరగంటి మాట్లాడుతూ, “ఎంఎస్ ధోని బ్రాండ్ అంబాసిడర్‌గా సరైన ఎంపిక, అతని వ్యక్తిత్వం JioMart వలె విశ్వసనీయమైనది. ధోని దేశానికి వేడుకలు జరుపుకోవడానికి అనేక సందర్భాలను అందించాడు. ఇప్పుడు కస్టమర్‌లు జియోమార్ట్‌లో జరుపుకోవడానికి మరొక అవకాశాన్ని అందిస్తున్నారు. ఈ వేడుకలో ‘షాపింగ్’ అంతర్భాగం కావడం విశేషం.

ఎలక్ట్రానిక్స్ నుండి ఫ్యాషన్ బ్యూటీ వరకు గృహాలంకరణ వస్తువుల వరకు, లక్షల కొద్దీ ఉత్పత్తులు JioMartలో అందుబాటులో ఉన్నాయి. JioMart ప్లాట్‌ఫారమ్‌లో అర్బన్ లాడర్, రిలయన్స్ ట్రెండ్స్, రిలయన్స్ జ్యువెల్స్, హామ్లీస్‌తో సహా రిలయన్స్ యాజమాన్యంలోని బ్రాండ్‌ల ఉత్పత్తులను కలిగి ఉంది.

ప్రస్తుతం జియోమార్ట్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో 1000 కంటే ఎక్కువ మంది కళాకారుల నుండి 1.5 లక్షల ఉత్పత్తులు అమ్ముడవుతున్నాయి. ప్రచార షూట్‌లో భాగంగా జియోమార్ట్ సీఈవో వరగంటి బీహార్ ఆర్టిజన్ అంబికా దేవి వేసిన మధుబని పెయింటింగ్‌ను ధోనీకి బహుమతిగా ఇచ్చారు. ధోని బ్రాండ్ అంబాసిడర్‌గా 45 సెకన్ల నిడివిగల ప్రచార చిత్రంలో కనిపించనున్నాడు.