కొత్త పథకాలపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన
కొత్త పథకాల అభ్యర్థనల కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖకు లేఖలు పంపడం మానేయాలని అన్ని మంత్రిత్వ శాఖలకు నోట్ ద్వారా పేర్కొంది.కరోనా నేపథ్యంలో నిధులకు సంబంధించి ప్రాధాన్యతలు మారిపోతున్నాయని అవసరమైన వాటికే నిధులను ఉపయోగించాల్సిన అవసరం ఉందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
న్యూ ఢిల్లీ: కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీల మినహా ఈ ఏడాది ఇతర కొత్త పథకాలను కేంద్రం ప్రకటించబోదని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ శుక్రవారం ప్రకటించారు.
పిఎం గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ, ఆత్మా నిర్భార్ భారత్ అభియాన్ ప్యాకేజీ, ఇతర ప్రత్యేక ప్యాకేజీల క్రింద ప్రకటించిన వాటి మినహా 2020-21లో ఎస్ఎఫ్సి ప్రతిపాదనలతో సహా లేదా ఈఎఫ్సి ద్వారా మంత్రిత్వ శాఖ అధికారం కింద కొత్త పథకాలు / ఉప పథకాలు ప్రారంభించదు ”అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో చెప్పారు.
కొత్త పథకాల అభ్యర్థనల కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖకు లేఖలు పంపడం మానేయాలని అన్ని మంత్రిత్వ శాఖలకు నోట్ ద్వారా పేర్కొంది.కరోనా నేపథ్యంలో నిధులకు సంబంధించి ప్రాధాన్యతలు మారిపోతున్నాయని అవసరమైన వాటికే నిధులను ఉపయోగించాల్సిన అవసరం ఉందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
ఒకవేళ తాజా నిబంధనలకు విరుద్ధంగా నిధులను కేటాయించాల్సి వస్తే.. డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎక్స్ పెండిచర్( ఖర్చుల శాఖ) అనుమతి తీసుకోవాలని అన్నారు.
also read ఇకపై బస్టాండులు, బస్ డిపోలలో పెట్రోల్ బంక్లు..!
"కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో, ప్రజా ఆర్థిక వనరులపై అపూర్వమైన డిమాండ్ ఉందని, మారుతున్న ప్రాధాన్యతలకు అనుగుణంగా వనరులను ఉపయోగించాల్సిన అవసరం ఉందని " అని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
కేంద్ర బడ్జెట్ కింద ఇప్పటికే ఆమోదించిన పథకాలు వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఉంటాయి. గత 24 గంటల్లో 9, 851 కరోనావైరస్ కేసులు, 273 మరణాలు నమోదయ్యాయి. దేశంలో మొత్తం కేసులు 2,26,770 కు పెరిగాయి. ఇప్పటివరకు 1,09,462 మంది కోలుకున్నారు, 6,348 మంది మరణించారు.
అమెరికా, బ్రెజిల్, రష్యా, యు.కె, స్పెయిన్, ఇటలీ తరువాత భారత్ ఇప్పుడు ఏడవ స్థానంలో ఉంది. మే 12న, ప్రధాని నరేంద్ర మోడీ రూ .20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. వలస కార్మికులు, పేదలు, రైతులు, ఎంఎస్ఎంఇలు, మధ్యతరగతి ప్రజలపై దృష్టి సారించి ఈ ప్యాకేజీ నిధులను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అనేక దశల్లో విడుదల చేశారు.