Asianet News TeluguAsianet News Telugu

New India Assurance: మార్కెట్‌లో 'న్యూ ఇండియా అస్యూరెన్స్' బూమ్.. 52 వారాల గరిష్టాన్ని తాకిన‌ షేర్లు

New India Assurance: గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో న్యూ ఇండియా అస్యూరెన్స్ షేర్లు 36 శాతం పెరిగాయి. 2023-24 ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 2023 త్రైమాసికం, ఏప్రిల్-సెప్టెంబర్ 2023 అర్ధ సంవత్సరం ఆర్థిక పనితీరుపై చర్చించేందుకు నవంబర్ 29న ఇన్వెస్టర్లు, విశ్లేషకులకు కాన్ఫరెన్స్ కాల్ నిర్వహించినట్లు న్యూ ఇండియా అస్యూరెన్స్ నవంబర్ 23న స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది.
 

New India Assurance Boom: New India Assurance shares jump 19% in one fell swoop; Hit 52 week high RMA
Author
First Published Nov 24, 2023, 4:39 PM IST

New India Assurance stock 52 week high: మార్కెట్ లో శుక్ర‌వారం ప్ర‌భుత్వ రంగ బీమా సంస్థ న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ బూమ్ కొన‌సాగింది. ఆ కంపెనీ షేర్లు కొత్త రికార్డుల‌ను న‌మోదుచేశాయి. దీని స్టాక్ 19 శాతం వరకు లాభపడింది. గరిష్ట ధర బ్యాండ్ కు కొన్ని అడుగుల దూరంలో ఉండ‌టం గ‌మ‌నార్హం. 2023-24 ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 2023 త్రైమాసికం, ఏప్రిల్-సెప్టెంబర్ 2023 అర్ధభాగం ఆర్థిక పనితీరుపై చర్చించడానికి నవంబర్ 29న ఇన్వెస్టర్లు, విశ్లేషకులకు కాన్ఫరెన్స్ కాల్ నిర్వహించినట్లు న్యూ ఇండియా అస్యూరెన్స్ నవంబర్ 23న స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. ఆ తర్వాత శుక్ర‌వారం (నవంబర్ 24న) కంపెనీ షేర్లు భారీగా పెరిగాయి.

శుక్ర‌వారం ఉదయం బీఎస్ఈలో న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ షేరు రూ.174.85 వద్ద ట్రేడ్ ప్రారంభమైంది. అంతక్రితం ముగింపుతో పోలిస్తే 19 శాతం పెరిగి 52 వారాల గరిష్ట స్థాయి రూ.207.75ను తాకింది. షేరు ధర 20 శాతం పెరిగి రూ.209.40కి చేరితే అప్పర్ సర్క్యూట్ ఉంటుంది. బీఎస్ఈలో ఈ షేరు 52 వారాల కనిష్ట స్థాయి రూ.94.15 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలో న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ షేరు రూ.176 వద్ద ప్రారంభమై, ఆ తర్వాత 52 వారాల గరిష్ట స్థాయి రూ.208ను తాకింది. ఈ సూచీలో షేరు అప్పర్ సర్క్యూట్ 20 శాతం పెరిగి రూ.209 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలో కంపెనీ షేరు 52 వారాల కనిష్ఠ స్థాయి రూ.94.60ని తాకింది.

గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో న్యూ ఇండియా అస్యూరెన్స్ షేర్లు 36 శాతం పెరిగాయి. అదే సమయంలో, ఇది 1 నెలలో సుమారు 28 శాతం పెరుగుద‌ల కావ‌డం గ‌మ‌నార్హం. 6 నెలల్లో సుమారు 47 శాతం పెరుగుదలను నమోదు చేసింది. న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీని సర్ దొరబ్జీ టాటా 1919లో ప్రారంభించారు. ఇది 1973 లో జాతీయం చేయడంతో ప్రభుత్వ భీమా సంస్థగా మారింది. ప్రస్తుతం న్యూ ఇండియా అస్యూరెన్స్ 25 దేశాల్లో పనిచేస్తోంది. దీనికి భారతదేశంలో 1900 పైగా కార్యాలయాలు ఉన్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios