రిలయన్స్ 45వ ఏజీఎం సందర్భంగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ రిలయన్స్ రిటైల్ లీడర్గా ఇషా అంబానీని షేర్ హోల్డర్లకు పరిచయం చేశారు. మీడియా నివేదికల ప్రకారం, ఇషా అంబానీ ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ నుండి స్కూలింగ్ అభ్యసించింది.
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ కూతురు ఇషా అంబానీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇషా తల్లిదండ్రుల పేరుతో మాత్రమే కాకుండా వ్యాపార ప్రపంచంలో కూడా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పర్చుకుంది. తాజాగా రిలయన్స్ 45వ ఏజీఎం సందర్భంగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ రిలయన్స్ రిటైల్ అధినేతగా ఇషాను షేర్ హోల్డర్లకు పరిచయం చేశారు.
23 అక్టోబర్ 1991న జన్మించిన ఇషా
ముఖేష్, నీతా అంబానీలకు కవలలు జన్మించింది. వీరిలో ఒకరు ఇషా మరొకరు ఆకాష్ అంబానీ. ఆకాష్ అంబానీ రిలయన్స్ జియో అధినేతగా నిర్వహిస్తున్నారు. నాలుగేళ్ల తర్వాత నీతా అంబానీ అనంత్ అంబానీకి జన్మనిచ్చింది.
యేల్ యూనివర్సిటీ నుండి సైకాలజీ డిగ్రీ
మీడియా నివేదికల ప్రకారం, ఇషా అంబానీ ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ నుండి స్కూలింగ్ అభ్యసించింది. తరువాత యేల్ యూనివర్సిటీ నుండి సైకాలజీ డిగ్రీ పొందారు.
4జీ ఇంటర్నెట్ సర్వీస్ ఆలోచన ఇషా అంబానీదే
ఇషా అంబానీ తన 16వ ఏట వ్యాపార ప్రయాణాన్ని ప్రారంభించింది. మీడియా కథనాల ప్రకారం, ఇండియాలో 4G ఇంటర్నెట్ సర్వీస్ ప్రారంభించాలనే ఆలోచన అమెదే. రిలయన్స్ 4జీ ఇంటర్నెట్ సర్వీస్ను ప్రారంభించడంలో ఇషా కీలక పాత్ర పోషించింది.
చదువు తర్వాత మొదటి ఉద్యోగం
ఇషా అంబానీ తన చదువు పూర్తయ్యాక మొదటి ఉద్యోగంలో చేరిందని, ఆ తర్వాతే ఆమె తన తండ్రి వ్యాపారంలోకి అడుగుపెట్టిందని చాలా మందికి తెలియదు. చదువు పూర్తయిన తర్వాత, ఆమె మెకిన్సే & కంపెనీలో మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా పనిచేశారు. అక్కడి నుండి అనుభవం తీసుకున్న తర్వాత, ఇషా అంబానీ 2016 సంవత్సరంలో ఆన్లైన్ ఫ్యాషన్ రిటైలర్ కంపెనీ AJIOను ప్రారంభించారు. నేడు ఈ బ్రాండ్ మహిళలు, పురుషులలో బాగా ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం ఇషా అంబానీ రిలయన్స్ రిటైల్కు సారథ్యం వహిస్తున్నారు. వాట్సాప్తో కలిసి రిలయన్స్ రిటైల్ త్వరలో వాట్సాప్లో కిరాణా వ్యాపారాన్ని ప్రారంభించనుంది. రిలయన్స్ 45వ AGM సందర్భంగా ఇషా అంబానీ షేర్హోల్డర్లకు ఈ విషయంలో ఒక ప్రజెంటేషన్ను కూడా చేశారు.
ఇషా అంబానీ 12 డిసెంబర్ 2018న పిరమల్ గ్రూప్కు చెందిన ఆనంద్ పిరమల్తో వివాహం జరిగింది. ఆనంద్ పిరమల్ స్వస్థలం రాజస్థాన్. ఇషా అత్తగారు స్వాతి పిరమల్ కూడా వృత్తిరీత్యా శాస్త్రవేత్త అండ్ పారిశ్రామికవేత్త. స్వాతి ముంబైలోని గోపీకృష్ణ పిరమల్ హాస్పిటల్ వ్యవస్థాపకురాలు. 2012లో పద్మశ్రీ అవార్డును కూడా అందుకున్నారు.
బాలీవుడ్లో ఇషాకు ఇద్దరు ప్రత్యేక స్నేహితులు
ఇషా అంబానీకి బాలీవుడ్లో ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఆమె చిన్ననాటి స్నేహితురాలు కియారా అద్వానీ మరొకరు ప్రియాంక చోప్రా. కియారా అద్వానీ ఇషా అంబానీకి స్కూల్ ఫ్రెండ్.
