ముంబైలో “పవర్ గ్రిడ్ ఓటి కాంప్లెక్స్” నిర్మాణం..
పవర్గ్రిడ్ సిఎస్ఆర్ చొరవ కింద మహిళలు, పిల్లల క్యాన్సర్ ఆసుపత్రి కోసం ఈ మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్ అభివృద్ధి చేయడానికి 26.40 కోట్ల ఆర్ధిక సహాయం చేయనుంది. “పవర్ గ్రిడ్ ఓటి కాంప్లెక్స్” అంటువ్యాధులను నివారించడానికి, ఆరోగ్య సంరక్షణ ఖర్చులను తగ్గించడానికి, ఫలితాలను మెరుగుపరచడానికి, రోగుల చికిత్సను నిర్ధారించడానికి సహాయపడుతుంది.
పవర్ మినిస్ట్రీ ఆధ్వర్యంలోని మహారత్న సిపిఎస్ఇ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ “పవర్ గ్రిడ్ ఓటి కాంప్లెక్స్” నిర్మాణం కోసం -నవీ ముంబైలోని ఏసిటిఆర్ఈసి, టిఎంసి మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్. అడ్వాన్స్ సెంటర్ ఫర్ ట్రీట్మెంట్, రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ క్యాన్సర్ (ఏసిటిఆర్ఈసి), టాటా మెమోరియల్ సెంటర్ (టిఎంసి), క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఎంఓయూ పై సంతకం చేసింది.
ఈ ఒప్పందంపై పవర్గ్రిడ్ డైరెక్టర్ (పర్సనల్) శ్రీ వి.కె. సింగ్, డాక్టర్ సుదీప్ గుప్తా, డైరెక్టర్, ఏసిటిఆర్ఈసి, టిఎంసి ఇద్దరు కలిసి శ్రీ డి. కె. సింగ్, ఇడి (నార్తర్న్ రీజియన్ -1), శ్రీ ఎస్. డి. జోషి, ఇడి (వెస్ట్రన్ రీజియన్- II), శ్రీ ఎం. కె. సింగ్, ఇడి (సిఎస్ఆర్ & ఇఎస్ఎండి), పవర్గ్రిడ్ మరియు పవర్గ్రిడ్, టిఎంసి ఇతర సీనియర్ అధికారుల సమక్షంలో సంతకం చేశారు. పవర్గ్రిడ్ సిఎస్ఆర్ చొరవ కింద మహిళలు, పిల్లల క్యాన్సర్ ఆసుపత్రి కోసం ఈ మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్ అభివృద్ధి చేయడానికి 26.40 కోట్ల ఆర్ధిక సహాయం చేయనుంది.
“పవర్ గ్రిడ్ ఓటి కాంప్లెక్స్” అంటువ్యాధులను నివారించడానికి, ఆరోగ్య సంరక్షణ ఖర్చులను తగ్గించడానికి, ఫలితాలను మెరుగుపరచడానికి, రోగుల చికిత్సను నిర్ధారించడానికి సహాయపడుతుంది. పవర్గ్రిడ్ ఇంతకుముందు 2016-17లో టిఎంసితో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. నవీ ముంబైలోని ఏసిటిఆర్ఈసి, టిఎంసి, ఖార్ఘర్ వద్ద రేడియేషన్ రీసెర్చ్ యూనిట్ నిర్మాణానికి 30 కోట్లు అందించనుంది.
ఇంటిగ్రేటెడ్ న్యూక్లియర్ థెరపీతో చికిత్స కోసం రోగులకు అవసరమయ్యే అంబులేటరీ, ఇన్-పేషెంట్ కేర్ అందించడం ముఖ్య ఉద్ధేశం. ఈ మొత్తం ప్రాజెక్టు వ్యయం గ్రౌండ్ ప్లస్ 7 అంతస్తుల భవనానికి 60 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. 50:50 నిష్పత్తిలో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ (డిఏఈ), భారత ప్రభుత్వం & పవర్గ్రిడ్ నిధులు సమకూరుస్తున్నాయి.