Asianet News TeluguAsianet News Telugu

మైక్రోసాఫ్ట్‌పైనే అందరి చూపు.. దేశంలో అత్యంత బెస్ట్ సంస్థగా పేరు..

 రాండ్‌స్టాడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ (REBR) 2020 ప్రకారం మైక్రోసాఫ్ట్ ఇండియా ఆర్థికంగా, బలమైన పేరు ప్రఖ్యాతలు, తాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల ఆగ్రా స్థానం సాధించింది. 

Microsoft India has emerged as the country's most attractive employer brand: survey says
Author
Hyderabad, First Published Jul 29, 2020, 10:45 AM IST

న్యూ ఢీల్లీ: టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇండియా దేశంలో అత్యంత ఆకర్షణీయమైన ఎంప్లాయర్ బ్రాండ్‌గా అవతరించింది, శామ్సంగ్ ఇండియా రెండవ స్థానంలో అమెజాన్ ఇండియా మరియు మూడవ స్థానంలో ఉన్నాయి.

రాండ్‌స్టాడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ (REBR) 2020 ప్రకారం మైక్రోసాఫ్ట్ ఇండియా ఆర్థికంగా, బలమైన పేరు ప్రఖ్యాతలు, తాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల ఆగ్రా స్థానం సాధించింది.

అయితే భారతీయ ఉద్యోగుల్లో 43 శాతం మంది మైక్రోసాఫ్ట్‌ కీర్తిని చూసి సంస్థలో పనిచేయాలని కోరుకోగా జీతం, ఉద్యోగ ప్రయోజనాలపట్ల ఆకర్షితులై 41 శాతం మంది, ఉద్యోగ భద్రత కారణంగా 40 శాతం మంది మైక్రోసాఫ్ట్‌ను ఎంచుకున్నారని తేలింది.

also read రైలు ప్రయాణికుల‌కు గుడ్‌న్యూస్.. ఇక‌పై ఈజీగా ట్రైన్ టికెట్ బుకింగ్‌.. ...

33 దేశాల్లోని 6,136 కంపెనీలపై 1,85,000 మంది (సాధారణ ప్రజలు, 18-65 సంవత్సరాల వయస్సు గలవారు) అభిప్రాయాలను ఆర్‌ఈ‌బి‌ఆర్ కోరింది. 2020 లో భారతదేశంలో అత్యంత ఆకర్షణీయమైన టాప్ 10 బ్రాండ్ బ్రాండ్లలో  నాలుగో స్థానంలో ఇన్ఫోసిస్ టెక్నాలజీస్, మెర్సిడెస్ బెంజ్ (5వ స్థానంలో), సోనీ (6వ స్థానంలో), ఐబిఎం (7వ స్థానంలో), డెల్ టెక్నాలజీస్ లిమిటెడ్ (8వ స్థానంలో), ఐటిసి గ్రూప్ (9వ స్థానంలో) టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (10వ స్థానంలో) ఉన్నాయి.

 81% మంది కంపెనీ ఫోన్ / కార్, పిల్లల సంరక్షణ సేవలు, సౌకర్యవంతమైన పని గంటలు వంటి  ప్రయోజనాలు ఉద్యోగం కోసం సంస్థల ఎంపికలో ప్రాధాన్యం కలిగి ఉన్నట్లు ర్యాండ్‌స్టడ్‌ తెలియజేసింది. సర్వే ప్రకారం, 38%  (18-24 సంవత్సరాలు) వారి యజమాని నుండి మంచి శిక్షణా అవకాశాల కోసం, 34% మంది (25-34 సంవత్సరాలు) ఫార్వర్డ్-థింకింగ్, టెక్-అవగాహన సంస్థలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తేలింది.  

తాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం చాలా ముఖ్యమైన లక్షణంగా భావింస్తున్నారు. 46% మంది (35-54 సంవత్సరాలు) లో అటు సంస్థకు, ఇటు వ్యక్తిగత జీవితానికి సమానంగా అధిక ప్రాధాన్యతనిస్తుండగా, అయితే 32% మంది(55-64 సంవత్సరాలు) తమకు అనువైన ప్రాంతాల్లో పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ఐటి, ఐటిఇఎస్ & టెలికాం, ఆటోమోటివ్ వంటి రంగాలలో పనిచేస్తున్న కంపెనీల కోసం పనిచేయడానికి భారతీయ ఉద్యోగులు ఇష్టపడుతున్నారని, తరువాత ఎఫ్‌ఎంసిజి, రిటైల్ & ఇ-కామర్స్, బిఎఫ్‌ఎస్‌ఐ ఉన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios