Metro Cash and Carry షాపింగ్ మాల్స్ త్వరలోనే రిలయన్స్ సొంతం.. డీల్ విలువ రూ. 4,060 కోట్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ దాదాపు 500 మిలియన్ యూరోల (రూ. 4,060 కోట్ల) తో భారతదేశంలో జర్మన్ రిటైలర్ మెట్రో AG క్యాష్ & క్యారీ షాపింగ్ మాల్స్ కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది, PTI అందించిన వార్త ప్రకారం, ఈ డీల్లో 31 హోల్సేల్ పంపిణీ కేంద్రాలు, భారీ ల్యాండ్ బ్యాంక్, జర్మన్ కంపెనీకి చెందిన ఇతర ఆస్తులు ఉన్నాయి, ఈ ఒప్పందంతో B2B విభాగంలో రిలయన్స్ ఉనికి మరింత విస్తరించగలదని భావిస్తున్నారు.
ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ జర్మనీకి చెందిన మెట్రో AJ గ్రూప్ , క్యాష్ & క్యారీ ఆర్మ్ ,(Metro Cash and Carry) భారతదేశ కార్యకలాపాలను రూ. 4,060 కోట్లకు (500 మిలియన్ యూరోలు) కొనుగోలు చేయనుంది. గత కొన్ని నెలలుగా కొనుగోలు ఒప్పందం కోసం ఇరు సంస్థల మధ్య చర్చలు జరుగుతుండగా గత వారం రిలయన్స్ రిటైల్ ప్రతిపాదనకు జర్మనీ కంపెనీ అంగీకరించినట్లు సమాచారం.
ఈ ఒప్పందంలో మెట్రో క్యాష్ & క్యారీకి (Metro Cash and Carry) చెందిన 31 హోల్సేల్ పంపిణీ కేంద్రాలు, భూమి , ఇతర ఆస్తులు ఉన్నాయి. అయితే, కొనుగోలుపై స్పందించడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ , మెట్రో నిరాకరించాయి. భారతదేశం , మెట్రో క్యాష్ & క్యారీ వ్యాపారాన్ని కొనుగోలు చేయడం వలన రిలయన్స్ రిటైల్ తన వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి సహాయపడుతుంది. మెట్రో 34 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2003లో భారత మార్కెట్లోకి ప్రవేశించింది.
మెట్రో క్యాష్ & క్యారీకి బెంగళూరులో 6, హైదరాబాద్లో 4, ముంబై , న్యూఢిల్లీలో ఒక్కొక్కటి 2 స్టోర్లు ఉన్నాయి. కోల్కతా, జైపూర్, జలంధర్, అమృత్సర్, అహ్మదాబాద్, సూరత్, ఇండోర్, లక్నో, మీరట్, నాసిక్, ఘజియాబాద్, తుంకూరు, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, హుబ్లీలలో ఒక్కో కేంద్రం ఉంది.
జూలై 2020లో, ఇ-కామర్స్ మేజర్ ఫ్లిప్కార్ట్ గ్రూప్ వాల్-మార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో 100% వాటాను కొనుగోలు చేసింది. వాల్-మార్ట్ మంచి లాభాలతో క్యాష్ & క్యారీ వ్యాపారాన్ని బాగా నడిపేది. అనేక ఇతర రిటైల్ సంస్థలు కూడా మెట్రో క్యాష్ & క్యారీ వ్యాపారాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపాయి. వాటిలో, లోటస్ బ్రాండ్తో క్యాష్ & క్యారీ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న సియామ్ మాక్రో కంపెనీ కూడా ఉంది. అయితే, గత నెలలో, మెట్రో క్యాష్ & క్యారీ భారతదేశం కొనుగోలు కోసం ఆ సంస్థ తమ బిడ్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.
ఇదిలా ఉంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇటీవల తన వ్యాపారాన్ని విస్తరిస్తోంది. ఇప్పటికే పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టింది. నాలుగైదు రోజుల క్రితమే రిలయన్స్ రిటైల్ సెలూన్ పరిశ్రమలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం. చెన్నైకి చెందిన 'నేచురల్స్ సలోన్ అండ్ స్పా' సెలూన్ కంపెనీకి చెందిన 49% షేర్లను రిలయన్స్ కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది.
కొన్ని రోజుల క్రితం, రిలయన్స్ తన మొదటి ఇన్-హౌస్ ప్రీమియం ఫ్యాషన్ , లైఫ్స్టైల్ స్టోర్ను ప్రారంభించింది. తండ్రి ముఖేష్ అంబానీ ఆగస్టులో 217 బిలియన్ డాలర్ల విలువైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ రిటైల్ చైర్పర్సన్గా ఇషా అంబానీని నియమించారు.