Asianet News TeluguAsianet News Telugu

LPG Cylinder: మహిళలకు దసరా ముందే గుడ్‌న్యూస్ వినిపించిన మోదీ సర్కార్..వీరికి సిలిండర్ ధర రూ.600 మాత్రమే..

కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ప్రధాన మంత్రి ఉజ్వల యోజనలో సబ్సిడీని పెంచారు. సబ్సిడీని రూ.200 నుంచి రూ.300కి పెంచారు. బుధవారం కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు సబ్సిడీ మొత్తాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

LPG Cylinder: Modi Sarkar has heard good news for women for them the price of cylinder is only Rs.600 MKA
Author
First Published Oct 4, 2023, 4:29 PM IST

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మరో పెద్ద ప్రకటన చేసింది. ఉజ్వల యోజన లబ్ధిదారులకు మరో బహుమతిని అందిందిచింది. ఎల్‌పిజి సిలిండర్‌పై సబ్సిడీని రూ.100 పెంచుబతూ మోడీ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అంటే గతంలో రూ.200 అదనపు సబ్సిడీకి బదులు ఇప్పుడు రూ.300 సబ్సిడీ అందుబాటులోకి వచ్చింది. దీంతో ఇప్పుడు లబ్ధిదారులకు ఒక ఎల్పీజీ సిలిండర్ ధర రూ.600కు దిగి వచ్చింది. 

బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు సబ్సిడీ మొత్తాన్ని పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను తెలియజేస్తూ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ విషయాన్ని ప్రకటించారు. గతంలో కూడా రక్షా బంధన్ సందర్భంగా ప్రభుత్వం ఎల్‌పిజి సిలిండర్ల ధరలను భారీగా తగ్గించడం గమనార్హం. అప్పట్లో గ్యాస్ సిలిండర్ ధర రూ.200 తగ్గించి ఉజ్వల పథకం లబ్ధిదారులకు సబ్సిడీని రూ.400కు పెంచారు. ఇప్పుడు సబ్సిడీని రూ.200 నుంచి రూ.300కి పెంచారు.

The government has raised subsidy amount for Pradhan Mantri Ujjwala Yojana beneficiaries from Rs 200 to Rs 300 per LPG cylinder: Union minister Anurag Thakur during a briefing on Cabinet decisions pic.twitter.com/Dvf7wXtXQT

— ANI (@ANI) October 4, 2023

ప్రధానమంత్రి ఉజ్వల యోజన 1 మే 2016న ప్రారంభించింది. ఇప్పటి వరకు దీని లబ్ధిదారుల సంఖ్య 9.60 కోట్ల మంది ఉన్నారు. రక్షాబంధన్ సందర్భంగా, ఎల్‌పిజి సిలిండర్లపై సబ్సిడీని పెంచుతున్నట్లు ప్రకటించడంతో పాటు, 75 లక్షల మంది లబ్ధిదారులను చేర్చడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది, ఈ పెరుగుదల తర్వాత, దేశంలో ఉజ్వల లబ్ధిదారుల సంఖ్య 10 కోట్ల 35 లక్షలకు పెరుగుతుంది.

గత నెల 2023 సెప్టెంబరులో, ఉజ్వల పథకం కింద ఎల్‌పిజి సిలిండర్‌పై ఇచ్చే సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం రూ. 200 నుండి రూ. 400కి పెంచినప్పుడు, రాజధాని ఢిల్లీలో 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1103గా ఉంది. ఉజ్వల లబ్ధిదారులు. దీని ధర రూ. 703. ఇప్పుడు రూ.200కి బదులు రూ.300 తగ్గింపు ఇవ్వడంతో సబ్సిడీ సిలిండర్ ధర రూ.603కి తగ్గింది. ఢిల్లీ నగరంలో సాధారణ పౌరులకు సిలిండర్ ధర రూ.903కు అందుబాటులో ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios