Asianet News TeluguAsianet News Telugu

రుణ తాత్కాలిక నిషేధం పై సుప్రీం కోర్ట్ కీలక తీర్పు.. విషయం ఏంటంటే ?

ప్రభుత్వ రుణ తాత్కాలిక నిషేధ విధానంలో జోక్యం చేసుకోవడానికి కోర్టు నిరాకరించింది. అలాగే రుణ తాత్కాలిక నిషేధాన్ని పొడిగించడానికి, ఆర్థిక ఉపశమనం కావాలన్న డిమాండ్‌ను కూడా కోర్టు తిరస్కరించింది. 

loan moratorium case :  judgment passed by supreme court says that waiver of interest not possible
Author
Hyderabad, First Published Mar 23, 2021, 6:42 PM IST

లోన్ మొరాటోరియం కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పును ప్రకటించింది. ప్రభుత్వ రుణ తాత్కాలిక నిషేధ విధానంలో జోక్యం చేసుకోవడానికి కోర్టు నిరాకరించింది. అలాగే రుణ తాత్కాలిక నిషేధాన్ని పొడిగించడానికి, ఆర్థిక ఉపశమనం కావాలన్న డిమాండ్‌ను కూడా కోర్టు తిరస్కరించింది.

చిన్న రుణగ్రహీతల వడ్డీని ప్రభుత్వం ఇప్పటికే మాఫీ చేసిందని కోర్టు తెలిపింది. దీని కంటే ఎక్కువ అదనపు ఉపశమనం ఇవ్వలని కోర్టు ఆదేశించదు. ఎందుకంటే మేము ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారులు కాదు. ఇంకా కరోనా కారణంగా ప్రభుత్వానికి పన్ను లాభాలు కూడా తక్కువగా లభించాయి అని వెల్లడించింది.

 అయితే తాత్కాలిక  రుణ నిషేధానికి ఎటువంటి వడ్డీని వసూలు చేయదని పేర్కొంది. అంటే, రుణగ్రహీతల నుండి వడ్డీ లేదా జరిమానా వసూలు చేయబడవు. ఏదైనా బ్యాంకు వడ్డీపై వడ్డీ వసూలు చేస్తే, దానిని తిరిగి ఇవ్వాల్సి ఉంటుందని కోర్టు తెలిపింది.

ఆర్థిక విధానం, ఉపశమన ప్యాకేజీ ఎలా ఉండాలో ప్రభుత్వం ఇంకా సెంట్రల్ బ్యాంక్ సంప్రదించిన తరువాత నిర్ణయిస్తుందని సుప్రీంకోర్టు తన నిర్ణయంలో తెలిపింది. జస్టిస్ అశోక్ భూషణ్, ఆర్ సుభాష్ రెడ్డి, ఎం.ఆర్ షాలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ప్రకటించింది.

also read స్టాక్ మార్కెట్ నష్టాలకు బ్రేక్ : 280 పాయింట్ల లాభంతో 50 వేలకు పైన ముగిసిన సెన్సెక్స్.. ...

కోర్ట్ నిర్ణయం బ్యాంకులకు ఉపశమనం కలిగించింది , అయితే మరోవైపు వడ్డీ మాఫీని కోరుతున్న రియల్ ఎస్టేట్ రంగం వంటి అనేక రంగాలు ఎదురుదెబ్బ తగిలింది. కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో రుణ వాయిదాల తాత్కాలిక నిషేధం, ఇతర ఉపశమనం కోసం దరఖాస్తు చేసుకున్న రియల్ ఎస్టేట్, విద్యుత్ రంగాలతో సహా వివిధ రంగాల వాణిజ్య సంఘాల పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. గత ఏడాది డిసెంబర్ 17న జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం వారి వాదనలు విన్న తర్వాత నిర్ణయాన్ని రిజర్వు చేసింది.

గత విచారణలో కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో రుణ వాయిదాల చెల్లింపును ఆరు నెలలు వాయిదాను రిజర్వ్ బ్యాంక్  పథకంలో భాగంగా అన్ని విభాగాలకు వడ్డీ మినహాయింపు ప్రయోజనం ఇచ్చినట్లు కేంద్రం కోర్టుకు తెలిపింది. ఈ భారాన్ని బ్యాంకులు భరిస్తే వారు మొత్తం నికర ఆస్తులలో ఎక్కువ భాగాన్ని కోల్పోతారని, ఇది రుణాలు ఇచ్చే  బ్యాంకు సంస్థలను ఆర్ధిక సంక్షిభంలో పడేస్తుందని కేంద్రం తెలిపింది.

విషయం ఏమిటి?
 లోన్ మొరాటోరియం కాలంలో  ఈ‌ఎం‌ఐ చెల్లింపుకు సంబంధించి చాలా ప్రశ్నలు తలెత్తాయి. వడ్డీపై వడ్డీ కేసు సుప్రీంకోర్టులో వచ్చింది. తాత్కాలిక రుణ  నిషేధం (మార్చి నుండి ఆగస్టు వరకు) వడ్డీపై వడ్డీని మాఫీ చేయడానికి అంగీకరించినట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఇచ్చిన అఫిడవిట్‌లో పేర్కొంది. వడ్డీ మాఫీ ఖర్చు సుమారు రూ .6,500 కోట్లు అని ప్రభుత్వ వర్గాలు అంచనా వేశాయి.

Follow Us:
Download App:
  • android
  • ios