జెట్ ఇంధనం ధరను పెంచే ప్రక్రియ కొనసాగుతోంది. చమురు కంపెనీలు శుక్రవారం మరోసారి ఏటీఎఫ్ ధరను రెండు శాతం పెంచాయి. అంతకుముందు మార్చి 16న విమాన ఇంధనం ధర రికార్డు స్థాయిలో 18 శాతం పెరిగింది.
విమానాల్లో ప్రయాణించే ప్రయాణికుల ప్రయాణం మరింత ఖరీదు కానుంది. నిజానికి అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో, అదే వేగంతో జెట్ ఇంధనం ధరలు కూడా పెరుగుతున్నాయి. విశేషం ఏంటంటే.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలను ఏడుసార్లు పెంచారు. కొత్త ఆర్థిక సంవత్సరం తొలిరోజే విమాన ప్రయాణికులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
ఆల్ టైమ్ హైకి ధరలు
విమాన ఇంధనం ధరలను పెంచే ప్రక్రియ కొనసాగుతోంది. శుక్రవారం, చమురు మార్కెటింగ్ కంపెనీలు జెట్ ఇంధనం ధరలను రెండు శాతం వరకు పెంచాయి. దీని తర్వాత, జెట్ ఇంధనం ధర కిలో లీటర్కు రూ.1,12,924.83 రికార్డుకు చేరుకుంది. ఇంతకుముందు కిలోలీటర్ రూ.1,10,066గా ఉండటం గమనార్హం.
మార్చి 16న ధరలు 18 శాతం
దేశ రాజధానిలో వీటి ధరలు 2 శాతం పెరిగి కిలోలీటర్కు రూ. 2,258.54కి చేరాయి, ఆ తర్వాత ATF ధరలు కిలోలీటర్కు రూ. 1,12,924.83కి చేరుకున్నాయి. అంతకుముందు మార్చి 16న ATF ధరలు రికార్డు స్థాయిలో 18 శాతం పెరిగాయి. అప్పుడు చమురు మార్కెటింగ్ కంపెనీలు జెట్ ఇంధనం ధరలను కిలోలీటర్కు రూ.17,137 పెంచాయి. విమానయాన సంస్థ నిర్వహణ వ్యయంలో విమాన ఇంధనం దాదాపు 40 శాతం వాటా ఉన్నందున ముడి చమురు ధరల పెరుగుదల ప్రభావం గణనీయంగా ఉంది.
ఈ ఏడాది జెట్ ఇంధనం ధర పెరగడం ఏడోసారి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర పెరగడంతో ఈ పెరుగుదల.. అంతర్జాతీయ సగటు ధర ఆధారంగా ప్రతినెలా 1, 16 తేదీల్లో జెట్ ఇంధన ధరలను సవరిస్తారు.
