ఇండో-యుఎస్ బిజినెస్ కౌన్సిల్ (యుఎస్ఐబిసి) చైర్పర్సన్ నిషా దేశాయ్ బిస్వాల్ మాట్లాడుతూ, భారతదేశం - అమెరికా మధ్య సంబంధాలు 'బలంగా ఇంకా శక్తివంతంగా' కొనసాగుతున్నాయని, రాబోయే నూతన సంవత్సరం 2021లో ఈ భాగస్వామ్యాన్ని మరింత విస్తృతంగా, లోతుగా చేయడానికి ఒక ముఖ్యమైన అవకాశాన్ని అందిస్తుందని అన్నారు.
వరుసగా రెండవ ఆర్థిక సంవత్సరంలో అమెరికా భారతదేశపు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, 2019-20లో అమెరికా-భారతదేశం మధ్య 88.75 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరిగింది.
అంతకుముందు 2018-19లో ఇది 87.96 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇండో-యుఎస్ బిజినెస్ కౌన్సిల్ (యుఎస్ఐబిసి) చైర్పర్సన్ నిషా దేశాయ్ బిస్వాల్ మాట్లాడుతూ, భారతదేశం - అమెరికా మధ్య సంబంధాలు 'బలంగా ఇంకా శక్తివంతంగా' కొనసాగుతున్నాయని, రాబోయే నూతన సంవత్సరం 2021లో ఈ భాగస్వామ్యాన్ని మరింత విస్తృతంగా, లోతుగా చేయడానికి ఒక ముఖ్యమైన అవకాశాన్ని అందిస్తుందని అన్నారు.
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఎన్నికైన తరువాత బాధ్యతలు స్వీకరించక ఇండో-యుఎస్ చిన్న వ్యాపార ఒప్పందం తన ఎజెండాలో అగ్రస్థానంలో ఉంటుందని నిషా దేశాయ్ బిస్వాల్ భావించారు. భారతదేశం -అమెరికా మధ్య వాణిజ్య భేదాలను పరిష్కరించడానికి చర్చలు జరుగుతున్నాయి.
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల కారణంగా గత నెలల్లో దీనిని ఖరారు చేయలేదు. యుఎస్ఐబిసి చైర్పర్సన్ బిస్వాల్ మాట్లాడుతూ, భారతదేశం-అమెరికా మధ్య చిన్న వాణిజ్య ఒప్పందం ఉన్నప్పటికీ, ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఏడాది పొడవునా ఉంటుందని బిస్వాల్ అన్నారు.
2021 గణనీయమైన అవకాశాలను అందిస్తుంది, అదనంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారతదేశం, యుఎస్, జపాన్, ఆస్ట్రేలియా (క్వాడ్ గ్రూప్) లను బలోపేతం చేయడం కూడా సంబంధాలను బలపరిచింది.
also read బ్యాంక్ కస్టమర్లకు ముఖ్య గమనిక, మరో రెండు బ్యాంకుల లైసెన్స్ను రద్దు చేసిన ఆర్బిఐ.. ...
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా రెండవసారి విదేశాంగ మంత్రిత్వ శాఖలో దక్షిణ, మధ్య ఆసియా ప్రాంత బాధ్యతలు నిషా దేశాయ్ బిస్వాల్కు ఇచ్చారు. ఇండో-యుఎస్ సంబంధాలను మరింత పెంచడంలో ఆమే కీలకపాత్ర పోషించారు.
కోవిడ్ -19 మహమ్మారి సమయంలో ఇరు దేశాలు తమ సొంత ప్రయోజనం కోసం కలిసి పనిచేయలేవని, ప్రపంచ స్థాయిలో కూడా రెండూ ముఖ్యమైనవని నిషా దేశాయ్ బిస్వాల్ అభిప్రాయపడ్డారు.
స్వచ్ఛమైన శక్తి, సోలార్, పునరుత్పాదక ఇంధనంలో భారత్ భారీగా పెట్టుబడులు పెట్టిందని బిస్వాల్ గుర్తించారు. 2020 చాలా ముఖ్యమైన సంవత్సరం అని, ఇందులో చాలా ముఖ్యమైన ఆర్థిక సంస్కరణలు ముందుకు వచ్చాయి.
కానీ ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోకపోవడం దురదృష్టకరం, దీని కోసం చాలా సమయం, ప్రయత్నాలు జరిగాయి. జనవరి 20న జో బిడెన్ అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వీలైనంత త్వరగా ఇరు దేశాలు ఈ దిశలో పయనిస్తాయని ఆమే ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 25, 2020, 5:36 PM IST