ఆరేళ్ల కనిష్టానికి పడిపోయిన జీడీపీ
ఉద్దీపన చర్యలు ప్రారంభించిన వెంటనే జీడీపీ ఆరేళ్ల కనిష్టానికి పడిపోయింది.
న్యూఢిల్లీ:ఆరేళ్ల కనిష్టానికి స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) పడిపోయింది. ఆర్ధిక మంద్యానికి ముందు జాగ్రత్తగా ఉద్దీపన చర్యలను కేంద్రం ప్రకటించిన కొద్దిసేపటికే జీడీపీ పడిపోయింది
జీడీపీ 5.8 శాతం నుండి 5 శాతానికి పడిపోయింది. పలు బ్యాంకులను విలీనం చేస్తున్నట్టు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించింది.దీంతో పాటు పలు ప్రకటనలను కేంద్రం చేసింది.
2019-20 ఆర్ధిక సంవత్సరం మొదటి క్వార్టర్ లో 5.8 శాతంగా జీడీపీ నమోదైంది. శుక్రవారం నాడు కేంద్రం ప్రకటించిన ఉద్దీపన చర్యలతో 0.8 శాతం జీడీపీ పడిపోయింది. ఈ తగ్గుదల ఆరేళ్ల కనిష్టానికి పడిపోయినట్టుగా ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.
2013 మార్చిలో జీడీపీ ఇదే స్థాయిలో ఉంది. ఆ సమయంలో 4.3 శాతంగా జీడీపీ నమోదైంది. ఆటోమోబైల్ రంగం కుదేలైంది.కార్ల అమ్మకాలు పడిపోయాయి. పలు రంగాల్లో పలువురు ఉద్యోగాలను కోల్పోయారు.