2020-21సంవత్సరానికి దేశ జిడిపిలో 1.58% ఆరోగ్య రంగాలకి కేటాయింపు: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
కరోనా వైరస్ మహమ్మారి గురించి చెప్పాలంటే ఈ వ్యాధి ప్రతి ఒక్కరినీ భయపెట్టింది. కరోనా వల్ల లక్షలాది మంది మృతిచెందగా, కోట్ల మంది ప్రజలు కూడా ఈ వ్యాధితో బాధపడవలసి వచ్చింది.
మన ఆరోగ్యం గురించి ఒకోసారి అనేక రకాల ఆలోచనలు ఖచ్చితంగా గుర్తుకు వస్తాయి. కరోనా వైరస్ మహమ్మారి గురించి చెప్పాలంటే ఈ వ్యాధి ప్రతి ఒక్కరినీ భయపెట్టింది. కరోనా వల్ల లక్షలాది మంది మృతిచెందగా, కోట్ల మంది ప్రజలు కూడా ఈ వ్యాధితో బాధపడవలసి వచ్చింది.
దీన్ని దృష్టిలో ఉంచుకుని దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కరోనా వ్యాక్సిన్ కోసం రూ .35 వేల కోట్లను బడ్జెట్ 2021-22లో ప్రకటించారు.
2020-21 సంవత్సరానికి ఆరోగ్య రంగానికి జిడిపిలో 1.8% కేటాయించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే 2021-22 సంవత్సరానికి ఆరోగ్య రంగానికి రూ .2,23,846 కోట్లు కేటాయించాలని నిర్మల సీతారామన్ ప్రతిపాదించారు.
ఈ కేటాయింపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ .94,452 కోట్లు, అంటే వచ్చే ఆర్థిక సంవత్సరానికి దీనిని 137 శాతం పెంచారు. 2019-20కి రూ .86,259 కోట్లు కేటాయించారు.
also read వాహనదారుల కోసం గూగుల్ పే సరికొత్త ఫీచర్.. కార్ ఉన్నవారికి ఎంతో ఉపయోగపడుతుంది.. ...
వైద్య ఆరోగ్య రంగానికి ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో పెరుగుదలను స్వాగతించారు. ఇది దేశంలో అన్ని వైద్య సౌకర్యాలు అందించడానికి, ఉపాధి అవకాశాలు పెంచడానికి ఇంకా ఆర్ధిక మొమెంటం పెంచడానికి అని చెప్పారు.
బడ్జెట్పై స్పందించిన అపోలో హాస్పిటల్ గ్రూప్ చీఫ్ ప్రతాప్ సి. రెడ్డి మాట్లాడుతూ బడ్జెట్ కేటాయింపుల పెంపు దేశంలోని అందరికీ వైద్య సదుపాయాలు కల్పిస్తుందని, ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతుందని, ఆర్థిక వేగాన్ని పెంచుతుందని అన్నారు.
కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవడంలో భారతదేశం చేసిన ప్రయత్నాలు అద్భుతంగా ఉన్నాయని అన్నారు.
అలాగే కోవిడ్ -19 కోసం రూ .35,000 కోట్లు కేటాయించడం అలాగే అవసరమైనప్పుడు ఇంకా ఎక్కువ కేటాయించాలనే నిబద్ధత మనం గర్వించదగిన దేశాన్ని ప్రపంచం ముందు రోల్ మోడల్గా మారుస్తుంది.
2030 నాటికి 80 శాతం మరణాలకు కారణమయ్యే అంటు వ్యాధుల సంక్షోభాన్ని ఇప్పుడు మనం గుర్తించాలిఅని తెలిపారు.