మొదటిసారి 1 లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు.. గత ఏడాదితో పోలిస్తే 10శాతం ఆదాయం వృద్ధి..
ఈ నెలలో జీఎస్టీ ఆదాయం కలెక్షన్ రూ .1,05,155 కోట్లు, ఇది 2019 అక్టోబర్ కంటే 10 శాతం ఎక్కువ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
అక్టోబర్ 2020లో వస్తు, సేవల పన్ను (జిఎస్టి) వసూళ్లు రూ.1.55 లక్షల కోట్లుకు చేరగా, నెలవారీ ఆదాయం ఎఫ్వై 21 లో రూ .1 లక్ష కోట్ల మార్కును దాటింది. ఈ నెలలో జీఎస్టీ ఆదాయం కలెక్షన్ రూ .1,05,155 కోట్లు, ఇది 2019 అక్టోబర్ కంటే 10 శాతం ఎక్కువ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
2020 అక్టోబర్లో వసూలు చేసిన వాటిలో సిజిఎస్టి రూ .19,193 కోట్లు, ఎస్జిఎస్టి రూ .25,411 కోట్లు, ఐజిఎస్టి రూ .52,540 కోట్లు, సెస్ రూ.8,011 కోట్లు ఉన్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
"2020 అక్టోబర్ నెలలో రెగ్యులర్ సెటిల్మెంట్ తర్వాత కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సంపాదించిన మొత్తం ఆదాయం సిజిఎస్టికి రూ .44,285 కోట్లు, ఎస్జిఎస్టి రూ .44,839 కోట్లు" అని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. జిఎస్టి ఆదాయం 2020 ఫిబ్రవరిలో రూ.1 లక్ష కోట్ల మార్కును దాటింది, మొత్తం వసూళ్లు 1,05,366 కోట్లు.
also read భార్య కోరిక.. ఇంటిపైకి ఎక్కిన స్కార్పియో కారు.. ఆనంద్ మహీంద్ర ట్వీట్.. ...
గతేడాది అక్టోబర్లో జీఎస్టీ ఆదాయం రూ.95,379 కోట్లుగా ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జీఎస్టీ ఆదాయం రూ.1.05 లక్షల కోట్లు, మార్చిలో రూ.97,597 కోట్లు, ఏప్రిల్లో రూ.32,172 కోట్లు, మేలో రూ.62,151 కోట్లు, జూన్లోరూ.90,917 కోట్లు, జూలైలో రూ.87,422 కోట్లు, ఆగస్టులో రూ.86,449 కోట్లు, సెప్టెంబర్లో రూ.95,480 కోట్లుగా ఉన్నాయి.
రూ.50 వేల కంటే విలువైన వస్తువుల రవాణాలో తప్పనిసరి అయిన ఈ–వే బిల్లుల చెల్లింపుల్లోనూ అక్టోబర్ నెలలో 21 శాతం వృద్ధి నమోదైంది. ప్రస్తుతం రోజుకు 29 లక్షల ఈ–ఇన్వాయిస్ జనరేట్ అవుతున్నాయి.
"జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలతో పోలిస్తే జిఎస్టి ఆదాయంలో పెరుగుదల వరుసగా -14 శాతం, -8 శాతం, 5 శాతం, దీనిని బట్టి ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ స్పష్టంగా చూపిస్తుంది" అని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. గత నెల అక్టోబర్ 31 నాటికి 80 లక్షల జీఎస్టీఆర్-3బి రిటర్న్స్ దాఖలు చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.