Asianet News TeluguAsianet News Telugu

GST Council Meeting:నేటి నుంచి జీఎస్టీ కౌన్సిల్ 47వ సమావేశం.. పన్ను రేట్లలో కీలక మార్పులు.. ?

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ 47వ సమావేశంలో రాష్ట్రాల ఆర్థిక మంత్రుల బృందం రెండు నివేదికలను సమర్పించనుంది. ఇందులో, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు రేట్ల హేతుబద్ధీకరణతో పాటు రెవెన్యూ లోటు భర్తీని కొనసాగించాలని గట్టిగా వాదించనున్నాయి.

GST Council Meeting: 47th meeting of the GST Council from today, there may be changes in tax rates
Author
hyderabad, First Published Jun 28, 2022, 10:28 AM IST

నేడు ప్రారంభం కానున్న  రెండు రోజుల జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో కొన్ని వస్తువుల పన్ను రేట్లలో మార్పు ఇంకా చిన్న ఇ-కామర్స్ సరఫరాదారులకు రిజిస్ట్రేషన్ నిబంధనలలో సడలింపులతో పాటు రాష్ట్రాలకు పరిహారం వంటి అంశాలను పరిశీలించే అవకాశం ఉంది.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ 47వ సమావేశంలో రాష్ట్రాల ఆర్థిక మంత్రుల బృందం రెండు నివేదికలను సమర్పించనుంది. ఇందులో, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు రేట్ల హేతుబద్ధీకరణతో పాటు రెవెన్యూ లోటు భర్తీని కొనసాగించాలని గట్టిగా వాదించనున్నాయి. అలాగే  కేంద్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని పేర్కొంటూ దానిని నిలిపివేయాలనుకుంటోంది.

సెస్సు వసూళ్లలో తగ్గుదల కారణంగా రాష్ట్రాల నష్టపరిహార నిధిలో లోటును తీర్చేందుకు కేంద్రం 2020-21లో రూ.1.1 లక్షల కోట్లు, 2021-22లో రూ.1.59 లక్షల కోట్లు రుణం తీసుకుంది. 45వ కౌన్సిల్ సమావేశంలో సీతారామన్ మాట్లాడుతూ ఆదాయ లోటుకు రాష్ట్రాలకు పరిహారం ఇచ్చే విధానం జూన్ 2022 లో ముగుస్తుంది అని తెలిపారు. ఈ సమావేశంలో అధికారుల కమిటీ లేదా ఫిట్‌మెంట్ కమిటీ ప్రతిపాదించిన పన్ను రేట్లను కూడా పరిశీలిస్తారు. 

కృత్రిమ అవయవాలు, ఆర్థోపెడిక్ ఇంప్లాంట్‌లపై ఏకరూప రేటు
ఆరు నెలల తర్వాత జరుగుతున్న జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో కృత్రిమ అవయవాలు, ఆర్థోపెడిక్ ఇంప్లాంట్స్‌పై ఏకరీతిగా 5% జీఎస్‌టీ విధించడంపై నిర్ణయం తీసుకోవచ్చు. ఇందుకోసం కమిటీ సిఫారసు కూడా చేసింది. ఇది కాకుండా రోప్‌వే ప్రయాణంపై 5% GST విధించాలని కూడా సిఫార్సు చేసింది. ప్రస్తుతం దానిపై 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంది. 


ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినో, హార్స్ రేసింగ్‌లపై 28 శాతం జీఎస్టీపై మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా అధ్యక్షతన ఏర్పాటైన మంత్రుల బృందం సమర్పించిన నివేదికపై చర్చ జరుగుతుంది. ఆన్‌లైన్ గేమింగ్ ద్వారా వచ్చే అన్ని ఆదాయాలపై పన్ను విధించాలని GoM తన నివేదికలో సిఫార్సు చేసింది. గేమ్‌లో పాల్గొన్న ప్లేయర్ చెల్లించే ఎంట్రీ ఫీజు కూడా ఇందులో ఉంటుంది. హార్స్ రేసింగ్‌ విషయానికొస్తే, బెట్టింగ్‌ల కోసం జమ చేసిన మొత్తంపై జిఎస్‌టి విధించాలని GoM సూచించింది.

వీటిపై కూడా చర్చించే అవకాశం 
ఇ-వాహనాలపై ఐదు శాతం పన్ను : ఇ-వాహనాలపై జిఎస్‌టి రేట్లపై స్పష్టత రావచ్చు. ఇందులో బ్యాటరీలు లేదా బ్యాటరీలు లేని ఈ-వాహనాలపై 5% జీఎస్టీ విధించడంపై చర్చ జరగొచ్చు. 

బంగారం/విలువైన రాళ్లకు అవసరమైన ఇ-వే బిల్లు: రూ.2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన బంగారం/విలువైన రాళ్ల ఇంటర్-స్టేట్ తరలింపు కోసం కౌన్సిల్ ఇ-వే బిల్లు అండ్ ఇ-చలాన్‌లను తప్పనిసరి చేయవచ్చు. 20 కోట్ల కంటే ఎక్కువ వార్షిక టర్నోవర్ ఉన్న కంపెనీల కోసం ఈ ఏర్పాటు ఉంటుంది. 

చిన్న ఇ-కామర్స్ సరఫరాదారులకు రిజిస్ట్రేషన్‌లో ఉపశమనం: ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించడం కోసం చిన్న వ్యాపారాలను తప్పనిసరి రిజిస్ట్రేషన్ నిబంధనల నుండి GST కౌన్సిల్ మినహాయించవచ్చు. అదనంగా, రూ. 1.5 కోట్ల వరకు టర్నోవర్ కలిగిన ఇ-కామర్స్ సరఫరాదారులు కాంపోజిషన్ స్కీమ్‌ను ఎంచుకోవడానికి అనుమతించబడతారు.

Follow Us:
Download App:
  • android
  • ios