బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ధరలు ఒక రోజు తగ్గుముఖం పడితే.. మరో రోజు పెరుగుతున్నాయి. ధరలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయి.
ఉక్రెయిన్-రష్యా యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉంటోంది. వివిధ ధరలపై ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం దేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా మంగళవారం (ఏప్రిల్ 5, 2022)న దేశంలో బంగారం, వెండి ధరలలో మార్పులు చోటు చేసుకున్నాయి. తాజాగా మంగళవారం దేశీయంగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఉదయం 6 గంటల సమయానికి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.150 తగ్గుముఖం పట్టగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.350 తగ్గుముఖం పట్టింది. ఇక కిలో వెండిపై రూ.200లకుపైగా తగ్గింది. అయితే వెండి ధర కొన్ని ప్రాంతాల్లో పెరిగింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
సాధారణంగా అంతర్జాతీయంగా బంగారం డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, డాలర్ విలువ బంగారంపై ప్రభావం చూపిస్తుంటాయనేది తెలిసిందే. అదే సమయంలో రెండు దేశాల మధ్య భౌతిక పరిస్థితులు బంగారం, వెండితో సహా అన్ని ఇతర అంశాలపై పెను ప్రభావం చూపిస్తుంటుంది.
బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,980గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.48,030 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,400గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,800 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.52,140 వద్ద ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,140గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,140గా ఉంది.
ఇకపోతే.. హైదరాబాద్లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.47,800 వద్ద కొనసాగుతోంది. ఇటు 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.52,140గా నమోదైంది. విజయవాడలో కూడా 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.47,800 వద్ద ఉంది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.52,140గా ఉంది. విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతోన్నాయి.
వెండి ధరలు
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.71,400 ఉండగా, ముంబైలో రూ.66,800గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.71,300 ఉండగా, కోల్కతాలో రూ.66,600గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.71,400 ఉండగా, కేరళలో రూ.71,400గా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.71,300 ఉండగా, విజయవాడలో రూ.71,400 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. అయితే ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.
