కొత్త ఏడాదికి ముందే పసిడి ప్రియులకు చుక్కలు.. భారీగా పెరిగిన బంగారం, వెండి.. నేడు తులం ధర ఎంతంటే..?
నేడు బంగారం ధర రూ.330 పెరిగి, 10 గ్రాముల పసిడి 24 క్యారెట్ల ధర రూ.54,930 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు వెండి ధరలు నిన్నటి ముగింపుతో పోలిస్తే రూ. 1000 పెరగ్గా, కిలో ధర రూ.71,300కి చేరింది.
బంగారం, వెండి కొనాలనుకునేవారికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత కొద్దిరోజులుగా అస్థిరంగా ఉన్న పసిడి ధరలు ఈ ఏడాది చివరి రోజున మళ్ళీ ఎగిశాయి. ఇంకో విషయం ఏంటంటే.. వచ్చే సంవత్సరం అంటే 2023 నుండి కూడా బంగారం, వెండి ధరలు భారీగా పెరగనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.
నేడు బంగారం ధర రూ.330 పెరిగి, 10 గ్రాముల పసిడి 24 క్యారెట్ల ధర రూ.54,930 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు వెండి ధరలు నిన్నటి ముగింపుతో పోలిస్తే రూ. 1000 పెరగ్గా, కిలో ధర రూ.71,300కి చేరింది.
ఒక నివేదిక ప్రకారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్నటి ధర నుండి రూ.300 పెరిగి రూ.50,350కి చేరుకుంది. ముంబై, కోల్కతా అండ్ హైదరాబాద్లలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 55,790, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,140 వద్ద ఉంది.
ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 55,080, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50,500 వద్ద ట్రేడవుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,580, , 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950గా ఉంది.
ఈ ఏడాది 2022 చివరి ట్రేడింగ్ రోజున 2:17 pm ET (1858 GMT) సమయానికి స్పాట్ బంగారం 0.2 శాతం పెరిగి ఔన్స్కు $1,818.70డాలర్లకి చేరుకుంది, అయితే US గోల్డ్ ఫ్యూచర్స్ మారకుండా $1,826.2 డాలర్ల వద్ద స్థిరపడ్డాయి. ప్రస్తుతం డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.69 వద్ద కొనసాగుతోంది.
ఢిల్లీ, ముంబై, కోల్కతాలో ప్రస్తుతం 1 కిలో వెండి ధర రూ.71,300 వద్ద ట్రేడవుతోంది. నిజానికి ఎక్సైజ్ సుంకం మరియు మేకింగ్ ఛార్జీ కారణంగా, బంగారం మరియు వెండి ధరలు మారుతూ ఉంటాయి. అలాగే వెండి విషయానికి వస్తే హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.500 పెరిగి ప్రస్తుతం రూ.74,500కు చేరింది.
ఇండియాలోని ప్రముఖ నగరాల్లో బంగారం, వెండి ధరల అప్ డేట్
నగరం 22క్యారెట్ 24క్యారెట్ వెండి కేజీ ధర
చెన్నై రూ. 51140 రూ. 55790 రూ. 74500
ముంబై రూ. 50350 రూ. 54930 రూ. 71300
ఢిల్లీ రూ. 50500 రూ. 55080 రూ. 71300
కోల్కతా రూ. 50350 రూ. 54930 రూ. 54930
బెంగళూరు రూ. 50400 రూ. 54980 రూ. 74500
హైదరాబాద్ రూ. 50350 రూ. 54930 రూ. 74500
అహ్మదాబాద్ రూ. 50400 రూ. 54980 రూ. 71300
సూరత్ రూ. 50400 రూ. 54980 రూ. 71300
నాగపూర్ రూ. 50350 రూ. 54930 రూ. 71300
పూణే రూ. 50350 రూ. 54930 రూ. 71300
భువనేశ్వర్ రూ. 50350 రూ. 54930 రూ. 74500
చండీగఢ్ రూ. 50500 రూ. 55080 రూ. 71300
జైపూర్ రూ. 50500 రూ. 55080 రూ. 71300
లక్నో రూ. 50500 రూ. 55080 రూ. 71300
పాట్నా రూ. 50400 రూ. 54980 రూ. 71300
మీరు బంగారం స్వచ్ఛతను చెక్ చేయాలనుకుంటే.. ఇందు కోసం ప్రభుత్వం ఒక యాప్ను రూపొందించింది. కస్టమర్లు BIS కేర్ యాప్ని ఉపయోగించి బంగారం స్వచ్ఛతను చెక్ చేయవచ్చు. మీరు బంగారం స్వచ్ఛతను చెక్ చేయడమే కాకుండా, దానికి సంబంధించి ఫిర్యాదులు చేయడానికి కూడా ఈ యాప్ని ఉపయోగించవచ్చు.