Asianet News TeluguAsianet News Telugu

బంగారం కొనేందుకు సరైన సమయం.. నేడు 24క్యారెట్ల 10గ్రాముల ధర ఎంతంటే ?

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు మంగళవారం కాస్త పెరిగాయి. దీంతో 22క్యారెట్ల 10 గ్రాములకు రూ .45 పెరిగి రూ .46,213 కు చేరుకున్నాయి. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,110గా ఉంది.
 

Gold Price Today Rises Above Rs 47,000-mark. Silver price Drops. Is it Time to Buy gold and silver
Author
Hyderabad, First Published Jun 22, 2021, 6:53 PM IST

దేశ రాజధాని ఢిల్లీలో బంగారు ధరలు మంగళవారం 22క్యారెట్ల 10 గ్రాములకు రూ .45 పెరిగి రూ .46,213 కు చేరుకున్నాయి. హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ ప్రకారం, సోమవారం దీని ధర 10 గ్రాములకు రూ .46,168 ఉంది. మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసిఎక్స్) లో గోల్డ్ ఫ్యూచర్స్ జూన్ 22న 10 గ్రాములకు 0.19 శాతం పెరిగి రూ.47,165  చేరుకుంది.

వెండి  ధర కూడా నేడు రూ.86 పడిపోయి కిలోకు రూ.66,389 చేరింది. గత ట్రేడింగ్ సెషన్లో వెండి కిలోకు రూ.66,475గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్‌కు 1,778 డాలర్లు, వెండి ఔన్స్‌కు 25.84 డాలర్లు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,100 అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,110

వజ్రాల ఎగుమతులు 20% పెరుగుతాయని అంచనా: క్రిసిల్
అమెరికా, చైనా మార్కెట్లలో మెరుగుదల కారణంగా భారత వజ్రాల పరిశ్రమలో ఈ ఏడాది ఎగుమతులు 20 శాతం పెరిగే అవకాశం ఉంది. భారతదేశం నుండి ఎగుమతి చేసిన పాలిష్ వజ్రాలలో 75 శాతం అమెరికా, చైనాకు వెళ్తున్నాయని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. కోరోనా మహమ్మారి ఒత్తిడి నుండి కోలుకోవడానికి ప్రయత్నిస్తున్న భారతీయ వజ్రాల పరిశ్రమ   త్వరలోనే ఊపందుకుంటుంది ఇంకా 2021లో ఎగుమతులు 20 బిలియన్ డాలర్లుగా ఉండవచ్చు.

also read  పెట్రోలు బంకు యజమాని బంపర్‌ ఆఫర్‌.. ఫ్రీగా 3 లీటర్ల పెట్రోలు.. క్యూకట్టిన ఆటో డ్రైవర్లు.. ...

గత సంవత్సరం ఎగుమతులు 16.4 బిలియన్ డాలర్లుగా ఉంది, 2019తో పోలిస్తే 12 శాతం తక్కువ. కోవిడ్-19 సెకూండ్ వేవ్ తరువాత వజ్రాల పరిశ్రమలో పనిచేసే కార్మికులు తిరిగి విధుల్లోకి వస్తారు దీంతో ఉత్పత్తిని కూడా వేగవంతం చేస్తుంది.

గత 2020-21 ఆర్థిక సంవత్సరంలో బంగారు దిగుమతులు 22.58 శాతం పెరిగి 34.6 బిలియన్ డాలర్లు అంటే రూ .2.54 లక్షల కోట్లకు చేరుకున్నాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం దేశీయ డిమాండ్ పెరగడం వల్ల బంగారం దిగుమతులు పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో వెండి దిగుమతులు 71 శాతం తగ్గి 791 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అంతకుముందు 2019-20 ఆర్థిక సంవత్సరంలో బంగారం దిగుమతి 28.23 బిలియన్ డాలర్లు. బంగారు దిగుమతులు పెరిగినప్పటికీ, గత ఆర్థిక సంవత్సరంలో దేశ వాణిజ్య లోటు 98.56 బిలియన్ డాలర్లకు తగ్గింది. 

దుబాయ్‌లో బంగారం ధరల విషయానికొస్తే 24క్యారెట్ల బంగారం గ్రాముకు AED 216.50 ( అంటే 4,371.11 భారత రూపాయి) వద్ద, 22క్యారెట్ల బంగారం గ్రాముకు AED 203.50 (4,108.70 భారత రూపాయి) వద్ద ట్రేడవుతోంది. ఈ సమాచారం దుబాయ్ గోల్డ్ & జ్యువెలరీ గ్రూప్ (డిజిజెజి) వెబ్‌సైట్ నుండి పొందబడింది. దుబాయ్  ఆభరణాల పరిశ్రమకు అతిపెద్ద వాణిజ్య సంస్థ డిజిజెజి అని వెబ్‌సైట్ పేర్కొంది.  
 

Follow Us:
Download App:
  • android
  • ios