ప్రస్తుతం దేశంలో దూసుకుపోతున్న బంగారం, వెండి ధరలు పడిపోతున్నాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర బుధవారం రూ. 47,750లు ఉండగా రూ .100 క్షీణించి గురువారం రూ.47,650కు దిగొచ్చింది. మరోవైపు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర బుధవారం రూ. 52,100 లు ఉండగా గురువారం రూ. 120 మేర తగ్గి 10 గ్రాములు రూ.51,980లుగా కొనసాగుతుంది.
పసిడి రేటు పడిపోతూనే వస్తోంది. వరుసగా మూడో రోజు కూడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. తెలుగు రాష్ట్రాల్లో (మార్చి 31, 2022) గురువారం 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,100 నుంచి రూ.51,980కు తగ్గింది. అంటే రూ.120 క్షీణించింది. అలాగే 22 క్యారెట్ల బంగారం అయితే రూ.47,750 నుంచి రూ.100 క్షీణతతో రూ.47,650కి దిగి వచ్చింది. సాధారణంగా అంతర్జాతీయంగా బంగారం డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, డాలర్ విలువ బంగారంపై ప్రభావం చూపిస్తుంటాయనేది తెలిసిందే. అదే సమయంలో రెండు దేశాల మధ్య భౌతిక పరిస్థితులు బంగారం, వెండితో సహా అన్ని ఇతర అంశాలపై పెను ప్రభావం చూపిస్తుంటుంది.
బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,980గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.47,920 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,280గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.59,180 వద్ద ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980గా ఉంది.
ఇకపోతే.. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.51,980 వద్ద ఉంది. విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతోన్నాయి.
వెండి ధరలు
ఓ వైపు దేశీయంగా బంగారం కొంతమేర దిగి వస్తే.. మరోవైపు వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజాగా ఢిల్లీలో కిలో వెండి ధర రూ.68,000 ఉండగా, ముంబైలో కిలో వెండి ధర రూ.68,000గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.72,100 ఉండగా, కోల్కతాలో రూ.68,000గా ఉంది. బెంగళూరులో కిలో బంగారం ధర రూ.72,100 ఉండగా, కేరళలో రూ.72,100గా ఉంది. ఇకపోతే.. హైదరాబాద్లో కిలో బంగారం ధర రూ.72,100 ఉండగా, విజయవాడలో రూ.72,100 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర ఉంది.
