పసిడి ప్రియులకు శుభవార్త. ఉక్రెయిన్‌, రష్యా దేశాల మధ్య యుద్ధం మొదలైన తర్వాత కాస్త దిగివచ్చిన బంగారం, వెండి ధరలు.. గత 4, 5 రోజులుగా పెరుగుతూ వచ్చాయి.

పసిడి ప్రియులకు శుభవార్త. ఉక్రెయిన్‌, రష్యా దేశాల మధ్య యుద్ధం మొదలైన తర్వాత కాస్త దిగివచ్చిన బంగారం, వెండి ధరలు.. గత 4, 5 రోజులుగా పెరుగుతూ వచ్చాయి. గురువారం పసిడి, వెండి ధరలు పెరగ్గా.. శుక్రవారం (మార్చి 4, 2022) మాత్రం కాస్త దిగొచ్చాయి. అంతర్జాతీయంగా బంగారం డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం డిమాండ్, వడ్డీ రేట్లు, వివిధ దేశాల మధ్య భౌగోళిక పరిస్థితులు, కరోనా మహమ్మారి, డాలర్ విలువ వంటివి ప్రభావం చూపిస్తుండటం వల్ల బంగారం ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. 

10 గ్రాముల బంగారం ధరపై రూ. 400 వరకు తగ్గింది. మరోవైపు వెండి ధర మాత్రం స్వల్పంగానే పెరిగింది. కిలో వెండి ధరపై రూ.100కు పైగా పెరిగింది. ఇక‌పోతే.. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (తులం బంగారం) ధర భారత మార్కెట్‌లో రూ.47,300 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,600గా ఉంది. 

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,400 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,600గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,300 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,600గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,470గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.52,850 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,300.. 24 క్యారెట్ల ధర రూ.51,600గా నమోదైంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.47,300 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,600గా ఉంది.

ఇక‌పోతే తెలుగు రాష్ట్రాలైన‌.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.47,300.. 24 క్యారెట్ల ధర రూ.51,600గా నమోదైంది. ఇక విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.47,300 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,600 వద్ద కొనసాగుతోంది. 

వెండి ధ‌ర‌లు
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.67,300గా ఉంది. ఆర్థిక రాజ‌ధాని ముంబైలో కిలో వెండి ధర రూ.67,300 ఉండగా.. చెన్నైలో కిలో వెండి ధర రూ.72,500 ఉంది. బెంగళూరులో రూ.72,500, కేరళలో రూ.73,000లుగా కొనసాగుతోంది. కోల్‌క‌తాలో కిలో వెండి ధ‌ర రూ. 67,300 వ‌ద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.72,500గా ఉంది. విజయవాడలో రూ.72,500, విశాఖపట్నంలో రూ.72,500లుగా కొనసాగుతోంది.