రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రభావంతో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. గత రెండు మూడు రోజుల నుంచి బంగారం, వెండి ధరలు తగ్గుతూ, పెరుగుతూ వస్తున్నాయి. బులియన్ మార్కెట్లో పసిడి, వెండి ధరల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే.
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రభావంతో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. గత రెండు మూడు రోజుల నుంచి బంగారం, వెండి ధరలు తగ్గుతూ, పెరుగుతూ వస్తున్నాయి. బులియన్ మార్కెట్లో పసిడి, వెండి ధరల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా బంగారం డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం డిమాండ్, వడ్డీ రేట్లు, వివిధ దేశాల మధ్య భౌగోళిక పరిస్థితులు, కరోనా మహమ్మారి, డాలర్ విలువ వంటివి ప్రభావం చూపిస్తుండటం వల్ల బంగారం ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ఇక తాజాగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. గురువారం (మార్చి 3, 2022)న దేశంలో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.
తాజాగా గురువారం బంగారం, వెండి ధరలు పెరిగాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (తులం బంగారం) ధర మార్కెట్లో రూ.47,700 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,040గా ఉంది. అయితే 22 క్యారెట్ల తులం బంగారంపై (Gold Price) రూ.1,000,.. 24 క్యారెట్లపై రూ.1,090 మేర పెరిగింది. బంగారం ధరలు పెరిగితే.. వెండి రేటు కూడా పైకి కదిలింది. వెండి రేటు భారీగా పెరిగింది. రూ.2100 పెరుగుదలతో రూ. 72,100కు ఎగసింది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,040గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,040, చెన్నై నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,800, 24 క్యారెట్ల ధర రూ.53,240 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,040 ఉంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,040 వద్ద కొనసాగుతోంది.
ఇకపోతే.. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,040 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,040గా ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,040గా ఉంది.
వెండి ధరలు
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.67,200గా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.67,200 ఉండగా.. చెన్నైలో కిలో వెండి ధర రూ.72,100 ఉంది. బెంగళూరులో రూ.72,100, కేరళలో రూ.72,100లుగా కొనసాగుతోంది. కోల్కతాలో కిలో వెండి ధర రూ. 67,300 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.72,100గా ఉంది. విజయవాడలో రూ.72,100, విశాఖపట్నంలో రూ.72,100లుగా కొనసాగుతోంది.
