తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (మంగళ‌వారం) స్థిరంగా ఉంది. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ వాతావరణంతో కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు పెద్ద ఎత్తున మార్పులు కనిపిస్తున్నాయి. ఇక వెండి గత ఐదు రోజులుగా నేలచూపులు చూస్తూనే ఉంది. 

బంగారం ధ‌ర‌లు మంగళ‌వారం నిల‌క‌డ‌గా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో పసిడి ధరలో నేడు ఎలాంటి మార్పులేదు. మంగళ‌వారం బంగారం ధ‌ర రూ.53,440 వ‌ద్ద నిల‌క‌డ‌గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,990 వ‌ద్ద స్థిరంగా ఉంది.ఇక వెండి ధర విషయానికి వస్తే.. ఏకంగా రూ.1100 పడిపోయింది. కేజీకి రూ.70,500కు దిగి వచ్చింది. వెండి గత ఐదు రోజులుగా నేలచూపులు చూస్తూనే ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 1 కేజీ వెండి ధర రూ.70,500గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధ‌ర‌లు మంగళ‌వారం నిల‌క‌డ‌గా ఉన్నాయి. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ వాతావరణంతో కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు భారీ ఎత్తున పెరిగిన సంగతి తెలిసిందే. ధ‌రలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక మంగళ‌వారం (ఏప్రిల్ 26, 2022) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,990 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.53,440గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.49,120 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,590గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,990 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.53,440 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,440గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,440గా ఉంది.

ఇక‌పోతే.. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.48,990 వద్ద కొనసాగుతోంది. ఇటు 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.53,440గా నమోదైంది. విజయవాడలో కూడా 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.48,990 వద్ద ఉంది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.53,440గా ఉంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతోన్నాయి.

వెండి ధరలు

ఇక వెండి ధర విషయానికి వస్తే.. ఏకంగా రూ.1100 పడిపోయింది. కేజీకి రూ.70,500కు దిగి వచ్చింది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.65,700 ఉండగా, ముంబైలో రూ.65,700గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.70,500 ఉండగా, కోల్‌కతాలో రూ.65,700గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.70,500 ఉండగా, కేరళలో రూ.70,500గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.70,500 ఉండగా, విజయవాడలో రూ.70,500 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. అయితే ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.