తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర శుక్రవారం ఇంకా పెరిగింది. గత కొన్ని రోజులుగా నిలకడగా ఉంటున్న ధరల్లో ఒక్కసారిగా కుదుపు చోటు చేసుకుంది. ఏకంగా 10 గ్రాములకు రూ.200 పెరిగింది. ఈ మూడు రోజుల్లోనే ధర రూ.950 పెరిగింది. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ వాతావరణంతో కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు భారీ ఎత్తున పెరిగిన సంగతి తెలిసిందే. వెండి ధర నేడు కిలోకు రూ.200 పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర మరోసారి పెరిగింది. నిన్నటితో పోలిస్తే శుక్రవారం మరో రూ. 200 పెరిగింది. గత కొన్ని రోజులుగా నిలకడగా ఉంటున్న ధరల్లో ఒక్కసారిగా కుదుపు చోటు చేసుకుంది. ఏకంగా 10 గ్రాములకు ధర రూ.200 పెరిగింది. ఈ మూడు రోజుల్లోనే బంగారం ధర రూ.950 పెరిగింది. బంగారం ధర పెరగడం ఇది వరుసగా మూడో రోజు. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ వాతావరణంతో కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు భారీ ఎత్తున పెరిగిన సంగతి తెలిసిందే. వెండి ధర నేడు కిలోకు రూ.200 పెరిగింది.
బంగారం ధరలు శుక్రవారం కూడా షాకిచ్చాయి. వెండి ధర కూడా పసిడి బాటలోనే పయనించింది. ధరలు ఒక రోజు తగ్గుముఖం పడితే.. మరో రోజు పెరుగుతున్నాయి. ధరలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక శుక్రవారం (ఏప్రిల్ 15, 2022) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!
బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,550 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.54,060గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.50,050 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,600గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,550 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.54,060 వద్ద ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.49,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,060గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,060గా ఉంది.
ఇకపోతే.. హైదరాబాద్లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.49,550 వద్ద కొనసాగుతోంది. ఇటు 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.54,060గా నమోదైంది. విజయవాడలో కూడా 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.49,550 వద్ద ఉంది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.54,060గా ఉంది. విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతోన్నాయి.
వెండి ధరలు
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.70,000 ఉండగా, ముంబైలో రూ.70,000గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.74,400 ఉండగా, కోల్కతాలో రూ.70,000గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.74,400 ఉండగా, కేరళలో రూ.74,400గా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.74,400 ఉండగా, విజయవాడలో రూ.74,400 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. అయితే ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.
