బంగారం ధర మ‌రోసారి పెరిగింది. బుధ‌వారం తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల బంగారం రేటు రూ. 400 పెరుగుదలతో రూ. 49 వేలకు చేరింది. గత రెండు రోజులుగా స్థిరంగా ఉంటూ వచ్చిన పసిడి రేట్లు బుధ‌వారం పైకి కదలడం గమనార్హం. వెండి కూడా కేజీకి రూ. 400 స్థాయిలోనే పెరిగింది. దీంతో వెండి ధ‌ర‌ రూ. 72,700కు చేరింది. వెండి ధర కేవలం 2 రోజుల్లోనే రూ. 1200 పెరిగింది. 

బంగారం ధర మ‌రోసారి పెరిగింది. గత రెండు రోజులుగా స్థిరంగా ఉంటూ వచ్చిన పసిడి రేట్లు బుధ‌వారం (ఏప్రిల్ 13, 2022) పైకి కదలడం గమనార్హం. మ‌రోవైపు వెండి ధ‌ర జిగేల్ మంది. వెండి కేజీకి రూ. 400 పెరుగుదలతో రూ. 72,700కు చేరింది. అంటే తులం వెండి ధర రూ. 727 వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ఇదే ట్రెండ్ ఉంది. బంగారం, వెండి ధ‌ర‌లు మ‌రోసారి పెరిగి సామాన్యుల‌కు షాకిస్తున్నాయి.

బంగారం ధరలు బుధ‌వారం షాకిచ్చాయి. రెండు రోజుల త‌ర్వాత ధ‌ర‌లు పెరిగాయి. వెండి ధ‌ర కూడా ప‌సిడి బాట‌లోనే ప‌య‌నించింది. ధరలు ఒక రోజు తగ్గుముఖం పడితే.. మరో రోజు పెరుగుతున్నాయి. ధరలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. 

అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక బుధ‌వారం (ఏప్రిల్ 13, 2022) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.53,450గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.49,470 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,000గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,000 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.53,450 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.49,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,450గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,450గా ఉంది.

ఇక‌పోతే.. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.49,000 వద్ద కొనసాగుతోంది. ఇటు 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.53,450గా నమోదైంది. విజయవాడలో కూడా 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.49,000 వద్ద ఉంది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.53,450గా ఉంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతోన్నాయి.

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.67,800 ఉండగా, ముంబైలో రూ.67,800గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.72,700 ఉండగా, కోల్‌కతాలో రూ.67,800గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.72,700 ఉండగా, కేరళలో రూ.72,700గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.72,700 ఉండగా, విజయవాడలో రూ.72,700 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. అయితే ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.