Asianet News TeluguAsianet News Telugu

జిఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌కు 1,127 కోట్ల నష్టం..

 ఆర్ధిక సంవత్సరం 2019లో జనవరి-మార్చి మధ్య కాలంలో  రూ .2,341.24 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఆర్ధిక సంవత్సరం 2020 పూర్తి సంవత్సరానికి జిఎంఆర్ మొత్తం రూ .2,198.49 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది.  

GMR Infrastructure Q4 results: Net loss Rs 1,127 crores
Author
Hyderabad, First Published Jul 31, 2020, 10:47 AM IST

హైదరాబాద్: మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో జిఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ నికర నష్టం 1,126.82 కోట్ల రూపాయలు అని తెలిపింది. ఆర్ధిక సంవత్సరం 2019లో జనవరి-మార్చి మధ్య కాలంలో  రూ .2,341.24 కోట్ల నష్టాన్ని చవిచూసింది.

ఆర్ధిక సంవత్సరం 2020 పూర్తి సంవత్సరానికి జిఎంఆర్ మొత్తం రూ .2,198.49 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది.  టర్నోవరు రూ.1,994 కోట్ల నుంచి రూ.2,349 కోట్లకు చేరింది.  నాలుగో త్రైమాసికంలో విమానాశ్రయాల విభాగం నుండి వచ్చిన  ఆదాయం 1,582 రూపాయలు.

మొత్తం సంవత్సరానికి విమానాశ్రయాల వ్యాపారం ద్వారా ఆదాయం 6,190.87 కోట్ల రూపాయలుగా నమోదైంది. అదే ఆర్ధిక సంవత్సరం 2019లో రూ .5,371.63 కోట్లు. ప్రధానంగా ఇంధన, రహదారి రంగంలో నష్టాలు, నికర విలువ క్షీణించడం, అప్పులు, వడ్డీ సర్వీసుల ఆలస్యం, కొన్ని రుణాలు తీసుకున్నందుకు తక్కువ క్రెడిట్ రేటింగ్ కారణంగా జి‌ఎం‌ఆర్ గ్రూప్ నష్టాలను చవిచూసింది.

also read  బిల్‌గేట్స్ , నేను ప్రేమికులం అనే వార్త నిజం కాదు: ఎలాన్ మాస్క్ ట్వీట్ వైరల్ ...

కొన్ని ఆస్తులలో వాటాలను అమ్మడం, ఆర్థిక సంస్థలు మరియు వ్యూహాత్మక పెట్టుబడిదారుల నుండి ఆర్ధిక సేకరణ, ఇప్పటికే ఉన్న రుణాల రీఫైనాన్స్ మరియు రుణాలు మరియు రుణాల తిరిగి చెల్లించటానికి ఇతర వ్యూహాత్మక కార్యక్రమాలు వంటి వివిధ కార్యక్రమాలను యాజమాన్యం తీసుకుంటోంది.

కోవిడ్-19 వేగవంతమైన వ్యాప్తి  కారణంగా ఇతర దేశాలకు ప్రయాణ పరిమితులను విధించాయి. జి‌ఎం‌ఆర్ సంస్థల వ్యాపారంపై కోవిడ్-19 ప్రభావం కొద్ది కాలం మాత్రమే ప్రభావితం చేస్తుందని జి‌ఎం‌ఆర్ విశ్వసిస్తుంది అని ఇన్ఫ్రా మేజర్ చెప్పారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios