ఈరోజు WTI క్రూడ్ ధర 0.46అంటే బ్యారెల్కు 0.49% పెరిగి $95.16కు చేరుకుంది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు 103.7 డాలర్లుగా కనిపించింది.
న్యూఢిల్లీ: నేడు ( 25 జూలై 2022) సోమవారం దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు విడుదలయ్యాయి. చమురు ధరలను నిర్ణయించే ప్రభుత్వ సంస్థలు ఇంధన ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో పెట్రోలు, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ఇప్పటికీ బ్యారెల్కు $ 100 పైనే ఉంది. గత వారం ట్రేడింగ్ ముగిసే సమయానికి కాస్త క్షీణతతో ముగిసింది. అయితే $100 కంటే పైగా ఉన్నప్పటికీ, బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్లు గత కొన్ని వారాలుగా క్షీణించాయి.
శుక్రవారం గ్లోబల్ బెంచ్మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్కు 0.56 శాతం తగ్గి 103.28 డాలర్లకు చేరుకుంది. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో బలహీనమైన డిమాండ్ కారణంగా వ్యాపారులు పొజిషన్లను తగ్గించుకున్నారు, ఈ కారణంగా ముడి చమురు ఫ్యూచర్స్ బ్యారెల్కు 1.23 శాతం పతనంతో రూ.7,682 వద్ద ముగిసింది.
క్రూడ్ ఆయిల్ ధర
ఈరోజు WTI క్రూడ్ ధర 0.46అంటే బ్యారెల్కు 0.49% పెరిగి $95.16కు చేరుకుంది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు 103.7 డాలర్లుగా కనిపించింది.
దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు
నగరం పెట్రోల్ డీజిల్
ఢిల్లీ 96.72 89.62
కోల్కతా 106.03 92.76
ముంబై 106.35 94.28
చెన్నై 102.63 94.24
నోయిడా 96.79 89.96
లక్నో 96.79 89.76
పాట్నా 107.24 94.04
జైపూర్ 108.48 93.72
హైదరాబాద్ 109.66 97.82
అంతర్జాతీయ క్రూడాయిల్ మార్కెట్ ధరల ప్రకారం దేశీయ ఇంధన ధరలను ప్రతిరోజూ సవరిస్తారు. కొత్త ధరలు ఉదయం 6 గంటల నుండి వర్తిస్తాయి. మంచి విషయమేమిటంటే, మీరు ఇంట్లో కూర్చొని కూడా ఇంధన ధరలను తెలుసుకొవచ్చు. ఇంధన ధరలను తెలుసుకోవడానికి, మీరు ఇండియన్ ఆయిల్ మెసేజ్ సర్వీస్ కింద మీ మెసేజ్ 'RSP-పెట్రోల్ పంప్ కోడ్' టైప్ చేసి మొబైల్ నంబర్ 9224992249కి SMS పంపాలి. మీరు ఇండియన్ ఆయిల్ పేజీ నుండి ఈ కోడ్ని పొందుతారు .