రుణాలపై వడ్డీ మాఫీ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం.. సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు
రుణగ్రహీతలకు పెద్ద ఉపశమనం కలిగిస్తూ ఆరు నెలల తాత్కాలిక రుణా నిషేధ కాలంలోని రూ.2 కోట్ల వరకు రుణాలపై కేంద్రం వడ్డీని వదులుకోవాలని నిర్ణయించినట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది.
న్యూ ఢీల్లీ: కోవిడ్ -19 మహమ్మారి ప్రభావంతో ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న రిటైల్, ఎంఎస్ఎంఇ (మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్) రుణగ్రహీతలకు పెద్ద ఉపశమనం కలిగిస్తూ ఆరు నెలల తాత్కాలిక రుణా నిషేధ కాలంలోని రూ.2 కోట్ల వరకు రుణాలపై కేంద్రం వడ్డీని వదులుకోవాలని నిర్ణయించినట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది.
అయితే అన్ని రకాల రుణాలకు వడ్డీని చెల్లించాలంటే రూ.6 లక్షల కోట్లు భారం పడుతుందని, అది చాలా అధికమని, అందుకే రూ.2 కోట్లు ఆ లోపుగల రుణాలకే వడ్డీ చెల్లించాలని నిర్ణయించామని కేంద్రం తెలిపింది. విద్య, గృహ, వినియోగ వస్తువులు, ఆటో రుణాలు, క్రెడిట్ కార్డు బకాయిల కోసం తీసుకున్న రుణాలు కూడా ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు.
అంతేకాకుండా తాత్కాలిక వ్యవధిలో రుణ బకాయిలను క్లియర్ చేసిన వారికి కూడా ఈ ప్రయోజనం లభిస్తుంది అని ప్రముఖ దినపత్రికలో ప్రచురించిన ఒక నివేదికలో తెలిపింది. ఫైనాన్స్ మినిస్ట్రీ కోర్టు ముందు సమర్పించిన అఫిడవిట్లో కరోనా మహమ్మారి పరిస్థితులలో వడ్డీని వదులుకునే భారాన్ని భరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొంది.
also read కరోనా కారణంగా డిస్నీ సంచలన నిర్ణయం.. అందుకే కొన్ని కార్యక్రమాలను కూడా నిలిపివేశాం.. ...
మాజీ కంప్ట్రోలర్ & ఆడిటర్ జనరల్ రాజీవ్ మెహ్రీషి నేతృత్వంలోని నిపుణుల కమిటీ సిఫారసులను ప్రభుత్వ నిర్ణయం అనుసరిస్తుందని ఒక వార్తాపత్రిక నివేదించింది.
కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ కారణంగ సాధారణ వ్యాపార కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడటం వల్ల ఆర్థిక సమస్యలపై ఆటుపోట్లు ఉండటానికి 1 మార్చి 2020 నుండి ఆరు నెలల వరకు రుణాన్ని తిరిగి చెల్లించడంపై ఆర్బిఐ తాత్కాలిక నిషేధాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఆరు నెలల తాత్కాలిక నిషేధం ఆగస్టు 31తో ముగిసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) సర్క్యులర్కు అనుగుణంగా రుణాలు తిరిగి చెల్లించే తాత్కాలిక నిషేధాన్ని రెండేళ్ల వరకు పొడిగించవచ్చని కేంద్రం గత నెల ప్రారంభంలో సుప్రీం కోర్ట్ కి తెలియజేసింది.