సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్కు టెస్లా సీఈవో, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ భారీ ఆఫర్ ఇచ్చారు. ఇటీవల వాటాల కొనుగోలుతో వాటాదారుగా మారిన మస్క్ ఏకంగా కంపెనీ కొనుగోలుకు ముందుకు వచ్చారు. కంపెనీకి చెందిన ఒక్కో షేరును 54.20 డాలర్ల చొప్పున కొనుగోలు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు.
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విటర్కు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు. కంపెనీకి అద్భుతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయని, వాటిని తాను అన్లాక్ చేస్తానని అంటున్నారు. ట్విటర్ను తనకు అమ్మేందుకు ఓ బెస్ట్, ఫైనల్ డీల్ను ప్రతిపాదించారు. ట్విటర్ ఒక్కో షేరుకు 54.20 డాలర్లు చెల్లించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఎలాన్ మస్క్ అన్నారు. జనవరి 28 ముగింపు ధరతో పోలిస్తే 54 శాతం ప్రీమియం చెల్లిస్తానని పేర్కొన్నారు. అప్పటికి ఆ షేరు ధరను విలువ కడితే 43 బిలియన్ డాలర్లు అవుతోంది. అప్పట్నుంచి ఈ సోషల్ మీడియా కంపెనీ షేరు 18 శాతం పెరిగింది.
గురువారం రోజు ఎలాన్ మస్క్ ఈ ఆఫర్ను అమెరికా సెక్యూరిటీ, ఎక్స్ఛేంజ్ కమిషన్ వద్ద దాఖలు చేశారు. ఇప్పటికే ఆ కంపెనీలో మస్క్కు 9 శాతం వాటా ఉంది. ఏప్రిల్ 4న తొలిసారి ఈ విషయాన్ని ఆయన ప్రకటించారు. టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. ట్విటర్లో ఎక్కువగా తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు. ఆయనకు ఈ వేదికలో 80 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ట్విటర్లో చేయాల్సిన మార్పులపై ఆయన ఇప్పటికే ఎన్నోసార్లు మాట్లాడారు. వాటా ఉందని తెలియడంతో కంపెనీ ఆయన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పదవిని ఆఫర్ చేసింది. దాంతో ఆయన లార్జెస్ట్ ఇండివిజ్యువల్ షేర్ హోల్డర్గా మారారు.
తన వాటా గురించి బయటకు తెలియగానే మస్క్ ఎన్నో ప్రతిపాదనలు చేశారు. మున్ముందు ఎలాంటి మార్పులు అవసరమో వెల్లడించారు. సాన్ ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయం, ట్వీట్లకు ఎడిట్ బటన్ ఇవ్వడం, ప్రీమియం యూజర్లకు ఆటోమేటిక్గా వెరిఫికేషన్ మార్క్స్ ఇవ్వడం గురించి మాట్లాడారు. చాలా అరుదగా ట్వీట్ చేసే ఎక్కువ ఫాలోవర్లు ఉన్న సెలెబ్రిటీల వల్ల ట్విటర్ చనిపోయే ప్రమాదం ఉందనీ ఆయన హెచ్చరించారు. బ్లూమ్బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం ఎలాన్ మస్క్ సంపద 260 బిలియన్ డాలర్లుగా ఉంది. దాంతో ఆయన సులభంగా ట్విటర్ను కొనుగోలు చేయగలరు. ఎందుకంటే ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ట్విటర్ విలువ 37 బిలియన్ డాలర్లు మాత్రమే.
స్పందించిన సీఈవో అగర్వాల్
ది వెర్జ్ నివేదిక ప్రకారం.. అగర్వాల్ గురువారం తన ఉద్యోగులతో 25 నిమిషాల సుదీర్ఘ ప్రశ్న, సమాధానాల సెషన్ను నిర్వహించారు. మస్క్ బాధ్యతలు స్వీకరిస్తే ట్విట్టర్ భవిష్యత్తు గురించి ఉద్యోగులు అనేక ప్రశ్నలు లేవనెత్తారని అజ్ఞాత అభ్యర్థనపై సమావేశంలో ఉన్న వర్గాలు ప్రచురణకు తెలిపాయి. బోర్డు ఏం చేస్తుందో అగర్వాల్ వెల్లడించలేదు. మస్క్ ఆఫర్ను కంపెనీ ఇంకా మూల్యాంకనం చేస్తోందని, వాటాదారులకు ఏది మేలు చేస్తుందో గుర్తించడం చాలా కఠినమైన ప్రక్రియ అని ఆయన అన్నారు. "బోర్డు కఠినమైన ప్రక్రియను" అనుసరిస్తుంది. "మా వాటాదారుల ఉత్తమ ప్రయోజనాల కోసం" నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. Q మరియు A సెషన్లో హాజరైన ఉద్యోగులలో ఒకరు మస్క్ కంపెనీని స్వాధీనం చేసుకుంటే భవిష్యత్ తొలగింపుల గురించి అగర్వాల్ను అడిగారు. "వ్యక్తిగత పనితీరు రేటింగ్ల ద్వారా నిర్దేశించబడదు" అని అతను పేర్కొన్నాడు. ట్విట్టర్ను ప్రైవేట్గా తీసుకుంటే ఉద్యోగుల స్టాక్ ఎంపికలపై వ్యాఖ్యానించడానికి అగర్వాల్ నిరాకరించారు.
