ముంబైకి చెందిన ఓ యువకుడు ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ లూయిస్ విట్టన్ షూ కొన్నాడు. అయితే కొనకముందే షాపులో కాళ్లకి సరిపోతుందా అని చూడకుండా ఇంటికి తీసుకొచ్చారు. తరవాత ఇంట్లో కాళ్లకు వేసుకొని చూస్తే తన పాదాలకు సరిపోదని భావించాడు.
ముంబై: లోదుస్తులు కాకుండా మనం ధరించేది ఏదైనా కోనే ముందు మనకి సరిపోతుందో లేదో చూడాలి, బట్టలు ఇంకా బూట్లు కోనే ముందు వాటిని చెక్ చేయాలి. అందుకే చాలా బట్టల దుకాణాల్లో ట్రయల్ రూమ్లు ఉంటాయి. షూ షాపుల్లో బూట్లను వేసుకునే ట్రై చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా చాలా ఖరీదైన వస్తువులు కొనేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించండి. ఎందుకంటే ఓ యువకుడు 80 వేల విలువైన షూ కొని ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు.
ముంబైకి చెందిన ఓ యువకుడు ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ లూయిస్ విట్టన్ షూ కొన్నాడు. అయితే కొనకముందే షాపులో కాళ్లకి సరిపోతుందా అని చూడకుండా ఇంటికి తీసుకొచ్చారు. తరవాత ఇంట్లో కాళ్లకు వేసుకొని చూస్తే తన పాదాలకు సరిపోదని భావించాడు. వెంటనే దుకాణానికి వెళ్లి ఈ షూని వెనక్కి తీసుకోవాలని కోరాడు. అయితే దానిని వెనక్కి తీసుకునేందుకు దుకాణదారుడు నిరాకరించడంతో ఆగ్రహించిన యువకుడు షాపుపై కేసు పెట్టాడు.
ముంబైలోని కొలాబా ప్రాంతంలోని లూయిస్ విట్టన్ అవుట్లెట్ నుండి ఈ షూను కొన్నాడు. అయితే ఇప్పుడు ఆ షూలు మరొకరికి అమ్మెందుకు వీల్లేదని చెప్పి వాటిని వెనక్కి తీసుకునేందుకు కంపెనీ నిరాకరించింది. దాని ధర తక్కువైతే సరే అని తీరిగి వెళ్లావచ్చు. అయితే వాటి ధర వెయ్యి కాదు రెండు వేలు కాదు ఏకంగా 80 వేల విలువైన షూస్ అని తెలిస్తే ఎలా సాధ్యమో చెప్పండి.
షూని కొన్నా మలాద్ జావేద్ ఆజం ఇప్పుడు ముంబైలోని కన్జ్యూమర్ కోర్టుకు వెళ్లి లూయిస్ విట్టన్ ఇండియా రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్పై ఫిర్యాదు చేశాడు. కన్జ్యూమర్ కోర్టులో జావేద్ అజామ్ దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం, అతను కొలాబాలోని లూయిస్ విట్టన్ ఇండియా అవుట్లెట్లో అక్కడి సేల్స్మెన్ సలహా మేరకు షూ కొన్నాడు. జావేద్ పాదాల సైజు చూసి షూస్ కొన్నారు. అలాగే జావేద్ బెంగుళూరు వెళ్ళడానికి చాలా హడావిడిగా ఉన్నాడు, దీంతో అక్కడ అతను ట్రయల్ చేయలేదు.
అయితే ఎయిర్పోర్టుకు చేరుకున్న తర్వాత షూ వేసుకునేందుకు ప్రయత్నించగా షూ సైజు వేరుగా ఉండడం గమనించాడు. అందుకే బెంగుళూరు చేరుకున్న తర్వాత మరో షూ కొని ఈ షూ ని ఉపయోగించకుండా పక్కన పెట్టాడు. తర్వాత షూని అవుట్లెట్కి తిరిగి ఇవ్వడానికి ముంబైకి వచ్చాడు. కానీ షూ రీసేల్ కు లేనందున తిరిగి తీసుకోలేమని రీఫండ్ చేయలేమని కంపెనీ తెలిపింది.
ఈ సంఘటన జనవరి 2021లో జరిగింది, 2021 సెప్టెంబర్లో ఆ యువకుడు కేసు నమోదు చేశాడు. తాజాగా ఈ కేసును విచారణకు స్వీకరించిన కన్జ్యూమర్ కోర్ట్ కొనుగోలుదారులకు 'సామరస్యపూర్వక పరిష్కారం' అందించాలని లూయిస్ విట్టన్ ఇండియాను కోరింది. అయితే ఈ విషయాన్ని రుజువు చేయాల్సిన బాధ్యత ఫిర్యాదుదారుపై ఉందని కమిషన్ పేర్కొంది. కేసును సక్రమంగా నిరూపించుకోవాల్సిన బాధ్యత ఇంకా తగిన పత్రాల ద్వారా మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత ఫిర్యాదుదారుపై ఉంటుంది. ఫిర్యాదుదారుడు షూలను రిటర్న్ చేసే ముందు షూ కండిషన్ కూడా కమిషన్ గమనిస్తుంది.
