Asianet News TeluguAsianet News Telugu

ఫ్లయిట్ చార్జీలకు రెక్కలు.. విమాన ప్రయాణం ఇక మరింత కాస్ట్లీ..

విమాన ప్రయాణాన్ని కొంచెం ఖరీదైనదిగా చేస్తూ, దేశీయ ఎఎస్‌ఎఫ్ వచ్చే నెల నుంచి రూ. 150 నుంచి రూ .165 కు పెంచుతామని, అంతర్జాతీయ ప్రయాణీకులు సెప్టెంబర్ 1 నుంచి ఎఎస్‌ఎఫ్‌గా 4.85 డాలర్లకు బదులుగా 5.2 డాలర్లు చెల్లించనున్నట్లు అధికారులు తెలిపారు. 

Civil Aviation Ministry from September 1 to charge passengers higher aviation security fee
Author
Hyderabad, First Published Aug 22, 2020, 12:04 PM IST

న్యూ ఢీల్లీ: దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులకు సెప్టెంబర్ 1 నుంచి అధిక విమానయాన భద్రతా రుసుము (ఎఎస్‌ఎఫ్) వసూలు చేయాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లు ప్రభుత్వ సీనియర్ అధికారులు గురువారం తెలిపారు.

విమాన ప్రయాణాన్ని కొంచెం ఖరీదైనదిగా చేస్తూ, దేశీయ ఎఎస్‌ఎఫ్ వచ్చే నెల నుంచి రూ. 150 నుంచి రూ .165 కు పెంచుతామని, అంతర్జాతీయ ప్రయాణీకులు సెప్టెంబర్ 1 నుంచి ఎఎస్‌ఎఫ్‌గా 4.85 డాలర్లకు బదులుగా 5.2 డాలర్లు చెల్లించనున్నట్లు అధికారులు తెలిపారు.

విమానయాన సంస్థలు టిక్కెట్లను బుక్ చేసుకున్నప్పుడు ప్రయాణికుల నుండి ఎఎస్‌ఎఫ్ ను సేకరించి ప్రభుత్వానికి ఇస్తాయి. దేశవ్యాప్తంగా విమానాశ్రయాలలో భద్రతా ఏర్పాట్లకు నిధులు సమకూర్చడానికి ఎఎస్‌ఎఫ్ ఉపయోగిస్తారు.

also read అనిల్ అంబానీపై దివాలా కేసు.. నేడు తీర్పును ప్రకటించిన ఎన్‌సిఎల్‌టి.. ...

మంత్రిత్వ శాఖ గత సంవత్సరం కూడా ఎఎస్‌ఎఫ్ ని పెంచింది. 2019 జూన్ 7న దేశీయ ప్రయాణికులకు రూ.130కు బదులుగా రూ.150 వసూలు చేస్తామని, అంతర్జాతీయ ప్రయాణీకులకు 2019 జూలై 1 నుంచి ఎఎస్‌ఎఫ్‌  3.25 డాలర్లకు బదులుగా 4.85 డాలర్లు వసూలు చేస్తామని మంత్రిత్వ శాఖ తెలిపింది.

కరోనావైరస్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని భారతదేశం, ఇతర దేశాలలో ప్రయాణ పరిమితుల కారణంగా విమానయాన రంగం గణనీయంగా ప్రభావితమైంది.

భారతదేశంలోని అన్ని విమానయాన సంస్థలు పేమెంట్ కోతలు, వేతనం లేకుండా సెలవు, ఉద్యోగులను తొలగించడం వంటి ఖర్చు తగ్గించే చర్యలు తీసుకున్నాయి. కరోనా వైరస్  లాక్ డౌన్ కారణంగా రెండు నెలల విరామం తరువాత భారతదేశం మే 25న దేశీయ ప్రయాణీకుల విమానాలను తిరిగి ప్రారంభించింది.

అయినప్పటికీ మే 25 నుండి భారత దేశీయ విమానాలలో సగటు ఆక్యుపెన్సీ రేటు కేవలం 50-60 శాతం మాత్రమే. కరోనావైరస్ మహమ్మారి కారణంగా షెడ్యూల్డ్ అంతర్జాతీయ ప్రయాణీకుల విమానాలు మార్చి 23 నుండి భారతదేశంలో నిలిపివేసింది. అయితే, ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) ఆమోదంతో ప్రత్యేక అంతర్జాతీయ విమానాలు నడుస్తున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios