Asianet News TeluguAsianet News Telugu

ఎయిర్‌పోర్ట్‌ కుంభకోణంలో జి‌వి‌కే గ్రూప్‌ చైర్మన్‌, అతని కుమారుడిపై సీబీఐ కేసు

ముంబై విమానాశ్రయం మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న వెంకట కృష్ణారెడ్డి కుమారుడు జివి సంజయ్ రెడ్డితో మరో తొమ్మిది ప్రైవేట్ సంస్థలు, విమానాశ్రయ అథారిటీ ఆఫ్ ఇండియాలోని కొందరు అధికారులపై సిబిఐ కేసు నమోదు చేసింది.అంతేకాకుండా ముంబై, హైదరాబాద్‌లోని జీవీకే గ్రూప్‌ కార్యాలయాల్లో విస్తృత సోదాలు నిర్వహించింది. 

CBI files case on GVK Group chairman& his son for siphoning off Rs 800 crore from Mumbai airport
Author
Hyderabad, First Published Jul 3, 2020, 3:46 PM IST

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి పేరిట 800 కోట్ల రూపాయలను దారిమళ్లించారన్న ఆరోపణలతో జివికె గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ జి వెంకట కృష్ణారెడ్డి, విమానాశ్రయ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఎఐ) లోని కొందరు అధికారులపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) బుధవారం జూలై 1 కేసు నమోదు చేసింది. 

ముంబై విమానాశ్రయం మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న వెంకట కృష్ణారెడ్డి కుమారుడు జివి సంజయ్ రెడ్డితో మరో తొమ్మిది ప్రైవేట్ సంస్థలు, విమానాశ్రయ అథారిటీ ఆఫ్ ఇండియాలోని కొందరు అధికారులపై సిబిఐ కేసు నమోదు చేసింది.అంతేకాకుండా ముంబై, హైదరాబాద్‌లోని జీవీకే గ్రూప్‌ కార్యాలయాల్లో విస్తృత సోదాలు నిర్వహించింది.

బుధవారం ఉదయం ప్రారంభమైన ఈ సోదాలు సాయంత్రం వరకు కొనసాగినట్టు సీబీఐ అధికారులు వెల్లడించారు. సెంట్రల్ ప్రోబ్ ఏజెన్సీ వారిపై క్రిమినల్ యాక్ట్, అవినీతి నిరోధక చట్టం 1988 కింద మోసం చేసినందుకు కేసు నమోదు చేసింది.

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం జివికె విమానాశ్రయాలు హోల్డింగ్స్ లిమిటెడ్, విమానాశ్రయ అథారిటీ ఆఫ్ ఇండియాల మధ్య జాయింట్ వెంచర్ ని నడుపుతున్నాయి. జివికె విమానాశ్రయాలు హోల్డింగ్స్ లిమిటెడ్‌ను జివికె గ్రూప్, మరికొన్ని విదేశీ సంస్థలు ప్రోమోట్ చేస్తున్నాయి.

also read ‘ఫెయిర్ & లవ్లీ’లో ‘ఫెయిర్’ ఔట్.. ఇక ‘గ్లో అండ్ లవ్లీ’ ఇన్ ...

విమానాశ్రయం  ఆధునికీకరణ, నిర్వహణ, నిర్వహణ కోసం 2006లో, విమానాశ్రయ అథారిటీ ఆఫ్ ఇండియా, జివికె విమానాశ్రయాల హోల్డింగ్స్ లిమిటెడ్ మధ్య ఒక ఒప్పందం కుదుర్చుకొన్నది.

ఎంఐఏఎల్‌ రాబడులను తక్కువగా, వ్యయాన్ని ఎక్కువగా చూపుతూ రికార్డులను తారుమారుచేసి భారీగా నిధులను దారిమళ్లించారన్న ఆరోపణలతో ఈ కేసు నమోదు చేసినట్టు సీబీఐ అధికారులు వివరించారు. ఎంఐఏఎల్‌ ఎగ్జిక్యూటివ్‌లతోపాటు గుర్తుతెలియని కొందరు ఏఏఐ అధికారులతో కలిసి జీవీకే గ్రూప్‌ ప్రమోటర్లు వివిధ మార్గాల్లో నిధులను దారిమళ్లించినట్టు ఆరోపణలు వచ్చాయని సీబీఐ అధికారులు తెలిపారు.

2017-18లో జీవీకే గ్రూప్‌ ప్రమోటర్లు బోగస్‌ వర్క్‌ కాంట్రాక్టులతో 9 కంపెనీలకు నిధులు మళ్లించారని, దీంతో ఎంఐఏఎల్‌కు రూ.310 కోట్ల నష్టం వాటిల్లిందని సీబీఐ ఆరోపించింది. ఈ కుంభకోణం వల్ల ఎంఐఏఎల్‌కు వాటిల్లిన నష్టం.. మున్ముందు జరిగే దర్యాప్తులో మరింత పెరిగే అవకాశం ఉన్నదని తెలిపారు.

అడ్డగోలు కాంట్రాక్టులతో జీవీకే గ్రూప్‌ ప్రమోటర్లు ఎంఐఏఎల్‌ రాబడులను తక్కువగా చూపారని, అంతేకాకుండా తమ వ్యక్తిగత, కుటుంబ ఖర్చుల కోసం ఎంఐఏఎల్‌ నిధులను ఉపయోగించుకొన్నారని సీబీఐ ఆరోపించింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios