Asianet News TeluguAsianet News Telugu

నేడు నష్టాలతో ప్రారంభమయిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 377 పాయింట్లు డౌన్..

నేడు వారంలో మూడవ ట్రేడింగ్ రోజున అంటే  గురువారం దేశీయ స్టాక్ మార్కెట్ ఎరుపు రంగులో ప్రారంభమైంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్   ఇండెక్స్ సెన్సెక్స్ 377.99 పాయింట్లతో 0.80 శాతం కోల్పోయి 47,031.94 వద్ద ప్రారంభమైంది. 

bse sensex nse nifty share market : sensex nifty indian indices opened lower amid weak global cues
Author
Hyderabad, First Published Jan 28, 2021, 11:09 AM IST

బలహీనమైన ప్రపంచ సూచనల కారణంగా నేడు వారంలో మూడవ ట్రేడింగ్ రోజున అంటే  గురువారం దేశీయ స్టాక్ మార్కెట్ ఎరుపు రంగులో ప్రారంభమైంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్   ఇండెక్స్ సెన్సెక్స్ 377.99 పాయింట్లతో 0.80 శాతం కోల్పోయి 47,031.94 వద్ద ప్రారంభమైంది.

అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 113.10 పాయింట్లతో  0.81 శాతం తగ్గి 13,854.40 వద్ద ప్రారంభమైంది.

 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం స్టాక్ మార్కెట్లు మూసివేయబడింది. 30 షేర్ల బిఎస్‌ఇ సెన్సెక్స్ అంతకుముందు వారంలో 156.13 పాయింట్లుతో 0.31 శాతం క్షీణించింది. 301 షేర్లు లాభపడగా, 883 షేర్లు క్షీణించాయి. 54 షేర్లలో ఎటువంటి మార్పు లేదు. బడ్జెట్‌కు ముందు స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గులు కొనసాగుతాయి అని నిపుణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  

గత వారం బిఎస్‌ఇ సెన్సెక్స్ వైపు బడ్జెట్ ర్యాలీ ప్రయాణం మొదటిసారి చారిత్రాత్మక గరిష్ట స్థాయిని 50,000 పాయింట్లను అధిగమించింది. అటువంటి పరిస్థితిలో, రాబోయే రోజుల్లో మార్కెట్లో లాభాల బుకింగ్ ప్రక్రియ ఉండవచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టి 2021-22 బడ్జెట్‌పై ఉందని విశ్లేషకులు తెలిపారు. 

 కరోనా వైరస్ మహమ్మారి మధ్య గత సంవత్సరంలో స్టాక్ మార్కెట్ చాలా హెచ్చు తగ్గులు చూసింది. 30 షేర్ల బిఎస్‌ఇ సెన్సెక్స్ మార్చి 24న ఏడాది కనిష్ట స్థాయి 25,638.9ను తాకింది. ఏదేమైనా సెన్సెక్స్ ఈ సంవత్సరంలో రికార్డు స్థాయికి చేరుకుంది. 

also read కేంద్ర బడ్జెట్ అంటే ఏమిటి ? ఇది తెలియాలంటే ముందు ఈ 21 పదాల అర్థాన్ని తెలుసుకోండి.. ...

స్టాక్ మార్కెట్ నేడు ప్రారంభ ట్రేడింగ్ సమయంలో ఒఎన్‌జిసి, ఎన్‌టిపిసి, ఏషియన్ పెయింట్స్ కాకుండా అన్ని కంపెనీలు రెడ్ మార్క్  మీద ప్రారంభమయ్యయి. ఇందులో రిలయన్స్, టిసిఎస్, ఎం అండ్ ఎం, ఎల్ అండ్ టి, ఐటిసి, ఐసిఐసిఐ బ్యాంక్, హిందూస్తాన్ యూనిలీవర్, టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే ఇండియా, హెచ్‌సిఎల్ టెక్, టెక్ మహీంద్రా, డివిస్ ల్యాబ్, ఇండస్ఇండ్ బ్యాంక్ మరియు సన్ ఫార్మా ఉన్నాయి.

ప్రీ-ఓపెన్ సమయంలో స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ 352.43 పాయింట్లు (0.74 శాతం) తగ్గి 47,057.50 వద్ద ఉదయం 9.02 వద్ద ప్రీ-ఓపెన్ సమయంలో ఉంది. నిఫ్టీ 226.10 పాయింట్లు (1.62 శాతం) తగ్గి 13,741.40 వద్ద ఉంది.

అంతకుముందు ట్రేడింగ్ రోజున కూడా సెన్సెక్స్ క్షీణించింది.సెన్సెక్స్  280.96 పాయింట్లు (0.58 శాతం) క్షీణించి 48,066.63 వద్ద ప్రారంభమైంది. అలాగే నిఫ్టీ 81 పాయింట్లు (0.57 శాతం) తగ్గి 14,157.90 వద్ద ఉంది. కానీ మధ్యాహ్నం తరువాత స్టాక్ మార్కెట్ భారీ అమ్మకాలను చూసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios