Breaking: దీపావళి నుంచి JIO 5G సర్వీసులు ప్రారంభం, RIL AGM సమావేశంలో ప్రకటించిన ముఖేష్ అంబానీ..
రిలయన్స్ ఏజీఎం భేటీలో గ్రూపు చైర్మన్ ముకేష్ అంబానీ JIO 5G సర్వీసులపై కీలక ప్రకటన చేశారు. ఈ సంవత్సరం దీపావళి నుంచి పలు నగరాల్లో 5జీ సర్వీసులను ప్రారంభించనున్నట్లు తెలిపారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL AGM) తన వార్షిక సర్వసభ్య సమావేశాన్ని నేడు డిజిటల్ కాన్ఫరెన్స్ రూపంలో నిర్వహిస్తోంది. ఈ సందర్బంగా 'RIL ఛైర్మన్, MD ముఖేష్ అంబానీ' వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కంపెనీ 45వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తున్నారు. JIO 5Gకి సంబంధించి ఆయన అతి పెద్ద ప్రకటన చేశారు. 2022 దీపావళి నాటికి దేశంలో జియో తన 5జీ సేవలను ప్రారంభిస్తుందని ముకేశ్ అంబానీ తెలిపారు. రిలయన్స్ జియో 2 లక్షల కోట్ల పెట్టుబడితో ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
RIL తన AGM నివేదికలో Jio 5Gతో తన మెగా ప్లాన్ను ప్రకటించింది. Jio టాప్ 1,000 నగరాల్లో 5G కవరేజ్ ప్లాన్లను పూర్తి చేసిందని, తన దేశీయ 5G టెలికాం గేర్ను పరీక్షించిందని తెలిపింది.
అంతేకాదు ముఖేష్ అంబానీ మరిన్ని వివరాలు పంచుకుంటూ, Jio 5G అన్ని విధాలుగా నిజమైన 5G అవుతుందని, మిగితా టెలికాం అగ్రిగేటర్ల తరహాలో కాకుండా తమ Jio 5G అడ్వాన్స్ డ్ 5G టెక్నాలజీ అని పేర్కొన్నారు. 5G అనేది కొంతమంది వ్యక్తుల కోసం మాత్రమే కాదు, మేము పాన్-ఇండియా ప్లాన్ను రూపొందిస్తాము. దీపావళి నాటికి, మేము ఢిల్లీ, ముంబై, కోల్కతా మరియు చెన్నై మెట్రోలతో సహా అనేక నగరాల్లో 5Gని ప్రారంభిస్తామన్నారు.
Jio 5G బ్రాడ్బ్యాండ్ ఇకపై 'జియో ఎయిర్ ఫైబర్' - ముఖేష్ అంబానీ
ముఖేష్ అంబానీ మాట్లాడుతూ - జియో 5G అల్ట్రా-హై-స్పీడ్ ఫిక్స్డ్-బ్రాడ్బ్యాండ్ అని, దీని ద్వారా మీరు ఎటువంటి వైర్లు లేకుండా ఫైబర్ని పొందుతారని, కాబట్టి మేము దీనిని JioAirFiber అని పిలుస్తున్నామని తెలిపారు. JioAirFiberతో, మీ ఇల్లు లేదా కార్యాలయాన్ని తక్షణమే గిగాబిట్-స్పీడ్ ఇంటర్నెట్కి కనెక్ట్ చేయడం చాలా సులభం అవుతుందని తెలిపారు.
జియో అందించే 5G నెట్వర్క్ నాన్-స్టాండలోన్ 5G నెట్వర్క్ అని, ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన నెట్వర్క్ను కూడా అందిస్తుందని ముఖేష్ అంబానీ చెప్పారు. ఇది అత్యంత అధునాతన 5G నెట్వర్క్ మాత్రమే కాదు, అతిపెద్దది అని కూడా తెలిపారు. ప్రత్యేకత ఏమిటంటే, మొత్తం నెట్వర్క్ 5G బ్యాండ్ నుండి మాత్రమే అందుబాటులో ఉంటుంది, ఇందులో 4G సహాయం తీసుకోదని తెలిపారు.
Jio ఈ అధునాతన 5G నెట్వర్క్ దాని వినియోగదారులకు ఇటువంటి అనేక అనుభవాలను ఇస్తుందని, ఇది ఇతర ప్రమాణాల కంటే చాలా ఎక్కువగా ఉంటుందని అంబానీ తెలిపారు. దీని ద్వారా మెరుగైన కవరేజీ, సామర్థ్యం, నాణ్యత, తక్కువ ఖర్చుతో కూడిన నెట్వర్క్ అందించబడుతుందన్నారు.. ఈ 5G నెట్వర్క్ ద్వారా మెషిన్ టు మెషిన్ కమ్యూనికేషన్ చాలా సులభం అవుతుందని తెలిపారు.