మేడిన్ ఇండియాకు గ్రీన్ సిగ్నల్స్: కొత్త బ్రాండ్లకు పెరుగుతున్న ఆర్డర్లు..
గాల్వాన్ లోయలో చైనా-భారత్ సైన్యాల మధ్య ఘర్షణతో చైనా ఉత్పత్తుల బాయ్ కాట్ నినాదానికి కొత్త బ్రాండ్ల ఉత్పత్తిదారుల నుంచి మద్దతు లభిస్తున్నది. చైనా సంస్థలు కూడా తమ ఉత్పత్తులను ఇతర ఆసియా దేశాలకు మళ్లించాలని యోచిస్తున్నాయి.
న్యూఢిల్లీ: ఇప్పటికే పాపులరైనా, కొత్తగా ఎంట్రీ ఇస్తున్న బ్రాండ్లు ఇండియాలోనే తమ మాన్యుఫ్యాక్చరింగ్ను చేపట్టాలని భావిస్తున్నాయి. ఈ బ్రాండ్ల నుంచి ఆర్డర్లు పెరుగుతున్నాయని ఇండియన్ కాంట్రాక్ట్ మాన్యుఫ్యాక్చరర్లు అంటున్నారు. టీవీలు, ఏసీలు, మైక్రోవేవ్ ఓవెన్లు, షూస్, స్పీకర్స్, ఇయర్ ఫోన్స్, సెట్టాప్ బాక్స్లు తదితర ఉత్పత్తుల తయారీ కోసం ఇండియన్ కాంట్రాక్ట్ మాన్యుఫ్యాక్చరర్లకు ఆర్డర్లు పెరుగుతున్నాయి.
సరిహద్దుల్లో తూర్పు లడఖ్ ప్రాంతంలోని గాల్వాన్ లోయలో చైనాలో భారత సైనికులకు ఘర్షణ నేపథ్యంలో చైనా ఉత్పత్తులను బాయ్కాట్ చేయాలని దేశంలో ప్రచారాలు ఊపందుకున్నాయి. దిగుమతులపై సుంకాలను కేంద్ర ప్రభుత్వం పెంచుతుందనే వార్తలూ వినిపిస్తున్నాయి.
దీంతో తమ మాన్యుఫ్యాక్చరింగ్ను ఇండియాలోనే చేపట్టాలని వివిధ బ్రాండ్లు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. కరోనా నేపథ్యంలో చైనా నుంచి ఫినిష్డ్ గూడ్స్ దిగుమతులను తగ్గించుకుంటున్నామని థర్డ్ పార్టీ మాన్యుఫ్యాక్చర్ సంస్థలు డిక్సన్, వీడియో టెక్స్ ఇంటర్నేషనల్, ఎస్ఎస్ఐపీఎల్ వంటి కంపెనీలు చెబుతున్నాయి.
తాజాగా సరిహద్దుల్లో ఘర్షణతోపాటు వోకల్ ఫర్ లోకల్ థీమ్ పెరుగుతున్ని. దీంతో తమ సప్లయ్ చెయిన్ను చైనా నుంచి మారుస్తున్నామని ఆయా సంస్థలు పేర్కొన్నాయి. కానీ రా మెటీరియల్స్, విడి భాగాలను మాత్రం ఎక్కువగా చైనా నుంచే దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని కంపెనీలు చెబుతున్నాయి. చైనాకు పోటీగా ఏ దేశం కూడా వీటిని తయారు చేయకపోవడమే దీనికి కారణం.
also read ‘భగభగ’మంటున్నబంగారం ధరలు..నేడు 10గ్రాములకు ఎంతంటే..?
‘ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా కంపెనీల చర్యలు ఉంటాయి. దిగుమతులపై అదనపు సుంకాలను విధిస్తే, ఈ కంపెనీలు ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటాయి’ అని ఇండియా–చైనా ట్రేడ్ సెంటర్ చైర్మన్ వీకే మిశ్రా అన్నారు.
ఉత్పత్తులు ఎక్కడ తయారయ్యాయో తెలుసుకోవడానికి వినియోగ దారులు ప్రాధాన్యం ఇస్తున్నారని, ఇండియాలో తయారైన వాటిపై ఆసక్తి పెరుగుతోందని డిక్సన్ టెక్నాలజీస్ చైర్మన్ సునీల్వాచానీ అన్నారు. దేశంలో 30 శాతం ఏసీలు దిగుమతి చేసుకున్నవేనని, చాలా వరకు మైక్రో ఓవెన్స్ను కూడా దిగుమతి చేసుకుంటున్నామని ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ బాడీ సీమా ప్రెసిడెంట్ కమల్నంది అన్నారు.
ఏసీలు, మైక్రో వోవెన్లలో ఎక్కువగా చైనాలో తయారైనవే ఉన్నాయని లక్ట్రానిక్స్ ఇండస్ట్రీ బాడీ సీమా ప్రెసిడెంట్ కమల్నంది చెప్పారు. వచ్చే ఏడాది కాలంలో ఈ పరిస్థితి మారుతుందని పేర్కొన్నారు. ఇండియాలోనే తమ ప్రొడక్ట్ లను తయారు చేయడానికి చాలా బ్రాండ్లు రెడీ అవుతున్నాయని వీడియోటెక్స్ ఇంటర్నేషనల్ డైరక్టర్ అర్జున్ బజాజ్ అన్నారు.
కొత్తగా టీవీ సెగ్మెంట్ లోకి అడుగుపెట్టిన కంపెనీలు కూడా కాంట్రాక్ట్ మాన్యుఫ్యాక్చరర్లతో తమ ఉత్పత్తిని ప్రారంభించాలని చూస్తున్నాయని చెప్పారు. కాగా వన్ ప్లస్, రియల్మీ వంటి చైనీస్ బ్రాండ్లు తమ టీవీలను ఇండియాలోనే తయారు చేస్తున్నాయి.
చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఫినిష్డ్ గూడ్స్ లిస్ట్ను కేంద్రం సిద్ధం చేస్తోందని వార్తలు వస్తున్నాయి. తమ చైనా ఉత్పత్తులను ఇతర ఏషియన్ దేశాలకు షిఫ్ట్ చేయాలని చాలా వరకు బ్రాండ్లు భావిస్తున్నాయని ఎస్ఎస్ఐపీఎల్ గ్రూప్ ఎండీ రిషబ్ సోని అన్నారు. ప్రస్తుతం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఉత్పత్తులను కేంద్రం రూపొందిస్తున్నది.