Asianet News TeluguAsianet News Telugu

2 నెలల తరువాత కనిపించిన జాక్ మా.. వీడియో కాన్ఫరెన్స్‌లో ఏం చెప్పాడంటే..

 అలీబాబా గ్రూప్ యజమాని, యాంట్ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు, చైనా పారిశ్రామికవేత్త  జాక్ మా గత రెండు నెలల తరువాత అకస్మాత్తుగా ప్రపంచానికి కనిపించారు.  ఇటీవల జరిగిన ఒక  వీడియో కాన్ఫరెన్స్‌లో  జాక్ మా కనిపించారు అని ట్విట్టర్ ద్వారా వెల్లడైంది. 

alibaba ceo Jack Ma Missing For Months, Emerges for First Time Since China Crackdown
Author
Hyderabad, First Published Jan 20, 2021, 1:11 PM IST

ఆసియాలోని అత్యంత ధనవంతులలో ఒకరైన  అలీబాబా గ్రూప్ యజమాని, యాంట్ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు, చైనా పారిశ్రామికవేత్త  జాక్ మా గత రెండు నెలల తరువాత అకస్మాత్తుగా ప్రపంచానికి కనిపించారు.

 ఇటీవల జరిగిన ఒక  వీడియో కాన్ఫరెన్స్‌లో  జాక్ మా కనిపించారు అని ట్విట్టర్ ద్వారా వెల్లడైంది. ప్రపంచంలో పెరుగుతున్న కరోనా ఒత్తిడి  మధ్య చైనా అధికారిక వార్తాపత్రిక జాక్ మా వీడియోను విడుదల చేసింది.  

ఈ వార్తా పత్రిక ప్రకారం, జాక్ మా చైనాలోని 100 గ్రామీణ ఉపాధ్యాయులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం చర్చించారు. 

ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ఉపాధ్యాయులను ఉద్దేశించి జాక్ మా ప్రసంగించారు. ఈ సమావేశం గ్రామీణ విద్యకు  సంబంధించిన వార్షిక కార్యక్రమంలో భాగం, ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది.

also read ఆస్ట్రేలియాపై ఇండియా టీం చారిత్రాత్మక విజయం.. ప్రశంసలు కురిపించిన నీతా అంబానీ.. ...

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో "కరోనా వైరస్ వ్యాప్తి తగ్గాక మనము మళ్ళీ కలుద్దాం " అని జాక్ మా ఉపాధ్యాయులతో అనడం కొసమెరుపు. ఒక వార్తా పత్రిక  జాక్ మాను ఆంగ్ల ఉపాధ్యాయుడిగా అభివర్ణించింది. 

జాక్ మా గత ఏడాది అక్టోబర్‌లో చైనా ప్రభుత్వంపై విమర్శించారు. కొన్ని నివేదికల ప్రకారం, అప్పటి నుండి జాక్ మా బహిరంగంగా ఎక్కడ కనిపించలేదు. తన టాలెంట్ షో 'బిజినెస్ హీరో ఆఫ్ ఆఫ్రికా' చివరి ఎపిసోడ్‌లో కూడా కనిపించకపోవడంతో జాక్ మా గురించిన మరింత తీవ్రమైంది.

ఈ ఎపిసోడ్లో జాక్  మా స్థానంలో అలీబాబా గ్రూప్ అధికారి కనిపించారు. అలీబాబా ప్రతినిధి ప్రకారం జాక్ మా తన బిజీ షెడ్యూల్ కారణంగా ఈ ఎపిసోడ్లో పాల్గొనలేదు అని తెలిపారు.

2020 అక్టోబర్‌లో చైనా ఆర్థిక రెగ్యులేటరీ, ప్రభుత్వ రంగ బ్యాంకులను జాక్ మా విమర్శించారు. షాంఘైలోని ఒక ప్రసంగం సమయంలో  ఈ విమర్శ చేశారు. వ్యాపారంలో ఆవిష్కరణ ప్రయత్నాలను అణిచివేసే సిస్టం మార్పులు చేయాలని జాక్ మా ప్రభుత్వాన్ని కోరారు. '

జాక్ మా చేసిన ఈ ప్రసంగం తరువాత చైనా పాలక కమ్యూనిస్ట్ పార్టీ క్షీణించింది. అప్పటి నుండి, జాక్ మా  యాంట్ గ్రూపుతో సహా అనేక వ్యాపారాలపై  ఆంక్షలు విధించడం ప్రారంభమైంది. జాక్ మా చివరిసారిగా అక్టోబర్ 10 న ట్వీట్ చేశారు. అప్పటి నుండి బహిరంగంగా కనిపించలేదు, ట్వీట్ చేయలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios