Asianet News TeluguAsianet News Telugu

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం, కోల్ ఇండియాతో సహా ఈ కంపెనీల్లో వాటాలను విక్రయించేందుకు జాబితా సిద్ధం..

కేంద్ర ప్రభుత్వం పలు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో తన వాటాలను విక్రయించడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇందులో కోల్ ఇండియా, హిందుస్థాన్ జింక్ , రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ (RCF) వంటి కంపెనీలు కూడా ఉన్నాయి. 

A key decision of the central government the list is ready to sell shares in these companies including Coal India
Author
First Published Nov 25, 2022, 6:30 PM IST

కోల్ ఇండియా, హిందుస్థాన్ జింక్ , రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ (RCF)లో 5 నుండి 10 శాతం వాటాలను విక్రయించాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది. బ్లూమ్‌బర్గ్ మీడియా అందిస్తున్న సమాచారం ప్రకారం ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఆదాయాన్ని పెంచడానికి కోల్ ఇండియా , హిందుస్థాన్ జింక్‌తో సహా ప్రభుత్వ కంపెనీలలో కొద్ది మొత్తంలో వాటాలను విక్రయించాలని యోచిస్తోంది. ప్రభుత్వం మార్చి 2023 నాటికి మూడు పెద్ద ప్రభుత్వ కంపెనీల్లో తన వాటాలను విక్రయించనుంది. ఈ కంపెనీల OFS (ఆఫర్ ఫర్ సేల్) తీసుకురావడానికి సిద్ధమవుతోంది.

65,000 కోట్లు సమీకరించాలని లక్ష్యం
ఈ ఏడాది ప్రభుత్వ కంపెనీల పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.65,000 కోట్లు సమీకరించాలని కేంద్ర  ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, అందులో ఇప్పటివరకు రూ.24,000 కోట్లు సమీకరించింది. మిగిలిన మూడు-నాలుగు కంపెనీల విక్రయాల ఆఫర్ల నుండి రూ.16,000 నుండి రూ.20,000 కోట్ల వరకు సమీకరించవచ్చు.

ఏ కంపెనీలో ఎంత వాటా విక్రయిస్తున్నారో చూద్దాం…
బ్లూమ్‌బెర్గ్ నివేదించిన లెక్కల ప్రకారం, ఈ మూడు కంపెనీల అమ్మకాల ఆఫర్‌లు దాదాపు రూ. 16,500 కోట్లు లేదా 2 బిలియన్ డాలర్లు పొందవచ్చు. కోల్ ఇండియా , OFS లో 3% వాటాలను విక్రయిస్తుంది, దీని నుండి 5,000 కోట్లు సమీకరించవచ్చు. హిందుస్థాన్ జింక్‌లో 8% వాటాలను విక్రయించడం ద్వారా 10,000 కోట్లు సమీకరించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అదే సమయంలో, RITESలో 10% వాటాకు బదులుగా రూ. 1,000 కోట్లు సేకరించవచ్చు.

ఈ కంపెనీ మొత్తం వాటాను విక్రయించేందుకు ఆమోదం లభించింది
మరోవైపు హిందుస్థాన్ జింక్ లిమిటెడ్‌లో ప్రభుత్వం పూర్తి వాటాలను విక్రయించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. హిందుస్థాన్ జింక్ మెజారిటీ ప్రభుత్వ యాజమాన్య సంస్థ. ఇప్పటికే అనిల్ అగర్వాల్ నేతృత్వంలోని వేదాంత గ్రూప్ కు కేంద్ర  ప్రభుత్వం 2002లో 26 శాతం వాటాను విక్రయించింది. ఈ మైనింగ్ దిగ్గజం కంపెనీలో మరింత వాటాను కొనుగోలు చేసి తన వాటాను 64.92 శాతానికి పెంచుకున్నారు.  

అమ్మకం జాబితాలో ఈ కంపెనీలు కూడా ఉన్నాయి
ఇతర మీడియా నివేదికల ప్రకారం, రాష్ట్రీయ కెమికల్స్ ఫెర్టిలైజర్స్ (RCF) , నేషనల్ ఫెర్టిలైజర్స్ (NFL)లో ప్రభుత్వం తన 10-20 శాతం వాటాను కూడా ఈ ఏడాది విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందనే వార్తలు వస్తున్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios