టిఇ ఉమెన్ రీజినల్ ఫైనల్స్ విజేతలను ప్రకటించిన సాపియన్ బయోసైన్సెస్
మొత్తం 16 మంది మహిళల నేతృత్వంలోని స్టార్టప్ల పోటీలో ఒక విజేతను, 3 రన్నరప్లను ప్రకటించారు.సాపియన్ బయోసైన్సెస్ రీజినల్ ఫైనల్స్ విజేత డాక్టర్ జుగ్ను జైన్, ఆమె బయోబ్యాంక్ మల్టీ-డిసీజ్ స్క్రీనింగ్ సొల్యూషన్ ఆలోచనకు మొదటి బహుమతిని పొందారు.
హైదరాబాద్, ఆగస్టు 26, 2020: సాపియన్ బయోసైన్సెస్ సోమవారం టిఐఈ ఉమెన్ రీజినల్ ఫైనల్స్ విజేతలను విజేతగా ప్రకటించింది. మొత్తం 16 మంది మహిళల నేతృత్వంలోని స్టార్టప్ల పోటీలో ఒక విజేతను, 3 రన్నరప్లను ప్రకటించారు.సాపియన్ బయోసైన్సెస్ రీజినల్ ఫైనల్స్ విజేత డాక్టర్ జుగ్ను జైన్, ఆమె బయోబ్యాంక్ మల్టీ-డిసీజ్ స్క్రీనింగ్ సొల్యూషన్ ఆలోచనకు మొదటి బహుమతిని పొందారు.
మొదటి రన్నరప్ స్థానం వాష్ చేసి తిరిగి వినియోగించుకునే ఫేస్ మాస్క్, హెడ్గేర్ సృష్టికర్త డిబ్బు సొల్యూషన్స్కు వెళ్ళింది. సిల్పా రెడ్డి స్థాపించిన లక్స్ప్యాక్ రెండవ రన్నర్స్ స్థానాన్ని దక్కించుకోగా, ప్రశాస్స షహానీ స్థాపించిన హెమిస్ 3వ రన్నరప్ స్థానాన్ని కైవసం చేసుకుంది. విజేతలను లక్ష్మి నంబియార్ (ఆంథిల్ వెంచర్స్), రంజన్ చక్ (ఓక్ ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్స్), జే కృష్ణన్ (మంత్ర క్యాపిటల్ )లతో కూడిన ప్రముఖ జ్యూరీ ప్యానెల్ నిర్ణయించింది.
టిఐఈ మహిళా విజేతల జాబితా
విజేత: డాక్టర్ జుగ్ను జైన్, కొ-ఫౌండేర్ సాపియన్ బయోసైన్సెస్ ని రీజనల్ ఫైనల్స్ విజేతగా ప్రకటించింది. ఈ సంస్థ క్యాన్సర్లు, అరుదైన రుగ్మతలు, హృదయ సంబంధ పరిస్థితులు, టైప్ 2 డయాబెటిస్ వంటి విభిన్న శాంపిల్స్ సేకరిస్తుంది.
రన్నరప్ 1: దీప్తి నథాలా, ఈమె ప్రాతినిథ్యం వహిస్తున్న డిబ్బు సొల్యూషన్స్ మొదటి రన్నరప్గా ఎంపికైంది. వాష్ లేక శుభ్రం చేయదగిన తీరిగీ ఉపయోగించుకునే ఫేస్ మాస్క్, హెడ్గేర్ గాలి ద్వారా సోకే అంటూ వైరస్ ల నుండి రక్షిస్తుంది.
రన్నరప్ 2: సిల్పా లింగారెడ్డి- ఆమే స్థాపించిన లక్స్ప్యాక్ రెండవ రన్నరప్గా ప్రకటించారు. లగ్జరీ ప్యాకేజింగ్ అనుభవాన్ని అందిస్తానని హామీ ఇచ్చే దృఢమైన బాక్స్ కంపెనీని తయారు చేస్తారు.
రన్నరప్ 3: ప్రశాన్స షహానీ, తాను స్థాపించిన హెమిస్ మూడవ రన్నరప్గా పేరు పొందారు. పాదరక్షలు, ఉపకరణాలు, స్టేషనరీ, గృహోపకరణాలు ఇతరవి అందిస్తుంది.
ముగ్గురు రన్నర్ అప్లు ఎంపొవర్ ద్వారా బూట్ క్యాంప్కు హాజరు కావడానికి అర్హత పొందుతారు. మెంటార్ అడ్వైజర్తో పాటు టి-హబ్లో ఆరు నెలల పాటు మెంటర్షిప్ పొందడంతో పాటు టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ వద్ద పొదిగే అవకాశం ఉంటుంది. “అనేక మహిళా పారిశ్రామికవేత్తలకు ఒక ఉదాహరణగా నిలిచిన కార్యక్రమంలో భాగం కావడం గౌరవంగా ఉంది. ఆర్థిక కార్యకలాపాల్లో మహిళలలు పాల్గొనడంలో భారతదేశం ఇంకా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది ”అని ఈ కార్యక్రమంలో హాజరైన హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి అన్నారు.