ఫైనాన్స్‌ కమిషన్‌ ఇన్‌ కోవిడ్‌ టైమ్స్‌ పేరుతో ఉన్న నివేదికను మంగళవారం ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కు సమర్పించనున్నారు. 

రాబోయే ఐదేళ్లలో కేంద్రం, రాష్ట్రాల మధ్య పన్నును ఏ నిష్పత్తిలో విభజించాలో 15వ ఆర్థిక కమిషన్ (ఎఫ్‌ఎఫ్‌సి) సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తన నివేదికను సమర్పించింది. ఫైనాన్స్‌ కమిషన్‌ ఇన్‌ కోవిడ్‌ టైమ్స్‌ పేరుతో ఉన్న నివేదికను మంగళవారం ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కు సమర్పించనున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

"15వ ఆర్థిక కమిషన్ ఛైర్మన్, సభ్యులు ఈ రోజు కమిషన్ నివేదిక కాపీని 2021-22 నుండి 2025-26 వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సమర్పించారు" అని ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. నవంబర్ 9న కమిషన్ ఈ నివేదికను ప్రెసిడెంట్ రామ్ నాథ్ కోవింద్‌కు సమర్పించిన సంగతి తెలిసిందే.

15వ ఆర్థిక కమిషన్ చైర్మన్ ఎన్.కె.సింగ్‌తో పాటు కమిషన్ సభ్యులు అలాగే అజయ్ నారాయణ్, అనూప్ సింగ్, అశోక్ లాహిరి, రమేష్ చంద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

"రాజ్యాంగం ప్రకారం నిర్దేశించిన విధంగా ఏ‌టి‌ఆర్ (యాక్షన్ టేకెన్ రిపోర్ట్) ద్వారా వివరణాత్మక మెమోరాండంతో పాటు ఈ నివేదికను సభ పట్టికలో ఉంచబడుతుంది" అని ప్రకటనలో పేర్కొంది.

also read సెన్సెక్స్-నిఫ్టీ బూమ్, అన్ని రంగాలు గ్రీన్ మార్క్ మీద ఓపెన్.. ...

ఎఫ్‌ఎఫ్‌సి రెండు నివేదికలను సమర్పించింది-మొదటి నివేదిక 2020-21 ఆర్థిక సంవత్సరానికి సిఫారసులను, రెండవది 2021-26 సిఫారసులతో తుది నివేదిక ఉంది.

అంతకుముందు 14వ ఆర్థిక కమిషన్ రాష్ట్రాలకు మొత్తం పన్నులలో 42% ఇవ్వాలని సిఫారసు చేయగా, 15వ ఆర్థిక కమిషన్ 2020-21 సంవత్సరానికి రాష్ట్రాలకు మొత్తం 8,55,176 కోట్లు అంటే 41 శాతం కేటాయించాలని సిఫారసు చేసింది.

 ఐదేళ్ల కాలానికి కమిషన్‌ తన సిఫారసులను 30 అక్టోబర్‌ 2020 నాటికి సమర్పించడం తప్పనిసరి. పలు కీలక ఆర్ధిక అంశాలకు సంబంధించి సిఫారసులను ఇవ్వాలని 15వ ఫైనాన్స్‌ కమిషన్‌ను కేంద్రం కోరింది.

కిందిస్థాయి వరకు పన్ను పంపిణీ, స్థానిక ప్రభుత్వ నిధులు, విపత్తు నిర్వహణ గ్రాంట్‌తో పాటు విద్యుత్, నగదు బదిలీ అమలు, వ్యర్థాల నిర్వహణ వంటి అనేక రంగాలలో రాష్ట్రాలకు పనితీరు ప్రోత్సాహకాలను పరిశీలించి సిఫారసు చేయాలని కమిషన్‌ను కోరింది.