రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేదరికంపై పోరుకు కేంద్ర ప్రభుత్వం 27 లక్షల కోట్ల తోడ్పాటు అందించిందని తెలిపారు. 'పూర్తి పారదర్శకతతో, ప్రభుత్వం భారతదేశ ప్రజలకు రూ. 27 లక్షల కోట్లు అందించిందని, అనేక పథకాల ద్వారా భారతదేశం కోట్లాది మంది ప్రజలను పేదరికం నుండి రక్షించిందని ప్రపంచ బ్యాంకు నివేదిక నిరూపించినట్లు తెలిపారు.

నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో సన్నాహకంగా బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఉభయ సభల ఎంపీలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. రాష్ట్రపతి ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తన ప్రసంగంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానంగా పేదరికంపై పోరుకు కేంద్ర ప్రభుత్వం 27 లక్షల కోట్ల తోడ్పాటు అందించిందని తెలిపారు. 'పూర్తి పారదర్శకతతో, ప్రభుత్వం భారతదేశ ప్రజలకు రూ. 27 లక్షల కోట్లు అందించామని, ఈ పథక ప్రభుత్వ ఏర్పాటు ద్వారా భారతదేశం కోట్లాది మంది ప్రజలను పేదరికం నుండి రక్షించిందని ప్రపంచ బ్యాంకు నివేదిక నిరూపించినట్లు తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చిన్న రైతులకు రెండున్నర లక్షల కోట్ల ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. లబ్ధిదారుల్లో అత్యధికులు మహిళలే ఉండటం విశేషం అన్నారు. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము మాట్లాడుతూ, 'ఈ 25 సంవత్సరాల అమృత కాలం స్వాతంత్ర్యం స్వర్ణ శతాబ్దం నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించే కాలం. ఈ 25 సంవత్సరాలు మనందరి కోసం, దేశంలోని ప్రతి పౌరుడి కోసం మన కర్తవ్యాలను నెరవేర్చేందుకు అసలైన పరీక్షా సమయం అన్నారు. 

భారత రాష్ట్రపతిద్రౌపది ముర్ము తన ప్రసంగంలో, '2047 నాటికి ఆధునికత కలిగి ఉన్న దేశాన్ని నిర్మించాలి. మనం 'స్వయం సమృద్ధిగా' విధులను నిర్వర్తించగల భారతదేశాన్ని నిర్మించాలని తెలిపారు. తన ప్రసంగంలో, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ, సుమారు తొమ్మిదేళ్లలో ప్రభుత్వం అనేక సానుకూల మార్పులు చేసిందని అన్నారు. ఈ రోజు ప్రతి భారతీయుడి విశ్వాసం గరిష్ట స్థాయికి చేరుకోవడంలో అతిపెద్ద మార్పు జరిగిందన్నారు. ప్రపంచం భారతదేశం పట్ల తన దృక్పథాన్ని మార్చుకుందన్నారు.

దేశప్రజలకు రాష్ట్రపతి కృతజ్ఞతలు 
ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము మాట్లాడుతూ, 'ఈరోజు, ఈ సెషన్ ద్వారా, దేశప్రజలు వరుసగా రెండు పర్యాయాలు సుస్థిర ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా ప్రభుత్వం ఎల్లప్పుడూ దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తుంది, విధాన-వ్యూహాన్ని పూర్తిగా మార్చాలనే సంకల్పాన్ని చూపిందని పేర్కొన్నారు. 

బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఏప్రిల్ 6 వరకు జరుగుతాయి.. 66 రోజుల పాటు జరిగే ఈ సెషన్‌లో మొత్తం 27 సభలు జరగనున్నాయి. మొదటి దశ సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 14 వరకు జరగనున్నాయి. ఉభయ సభల సంయుక్త సమావేశంలో అధ్యక్షుడు ముర్ము తన మొదటి ప్రసంగం చేశారు. సెషన్‌లో, 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రపతి ప్రసంగం, సాధారణ బడ్జెట్ మొదలైన వాటిపై ధన్యవాద తీర్మానంపై సజావుగా చర్చ జరుగుతుంది. అదే సమయంలో, అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ నివేదికతో పాటు గవర్నర్ల పనితీరు, కుల ఆధారిత జనాభా లెక్కలు, ద్రవ్యోల్బణం, కొన్ని రాష్ట్రాల్లో నిరుద్యోగం వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ముట్టడించాలని ప్రతిపక్షాలు స్పష్టమైన సంకేతాలను ఇచ్చాయి.