Asianet News TeluguAsianet News Telugu

జెస్ట్ మనీతో ఒకినావా చేతులు.. కస్టమర్ల ఈఎమ్ఐ సమస్యలు మరింత ఈజిగా..

ఈ పార్టనర్‌షిప్ గతంలో సిబిల్ స్కోరు లేని ఖాతాదారులకు సైతం ఒకినావా ప్రొడక్ట్‌లు కొనుగోలు చేయడానికి ఫైనాన్సింగ్ ఆప్షన్‌ పొందేందుకు సహాపడింది. ఖాతాదారులు డిజిటల్ కెవైసి పూర్తి చేసి, కొనుగోలు సమయంలో వారి సౌకర్యవంతమైన తిరిగి చెల్లించే ప్లాన్ ఎంచుకోవడం ద్వారా జెస్ట్ మనీ నుంచి క్రెడిట్ లిమిట్‌ని ఉపయోగించుకోవచ్చు. ఈ ప్రక్రియ పూర్తిగా పేపర్‌లెస్, ఫిజికల్ మీటింగ్ లేకుండానే పూర్తిగా ఆన్‌లైన్‌లో చేయవచ్చు.

Okinawa Partners with ZestMoney to Provide EMI solutions to Customers
Author
Hyderabad, First Published Nov 3, 2020, 4:34 PM IST

హైదరాబాద్, నవంబర్ 03, 2020: ‘మేక్ ఇన్ ఇండియా’పై దృష్టి సారించే భారతీయ ఎలక్ట్రిక్ టూ వీలర్ బ్రాండ్ అయిన ఒకినావా టూవీలర్ ప్రొడక్ట్‌లన్నింటిపైన సౌకర్యవంతమైన ఈఎమ్ఐ ఫైనాన్సింగ్ అందించడానికి భారతదేశంలోని ప్రముఖ ఎఐ-ఆధారిత ఈఎమ్ఐ ఫైనాన్సింగ్, ‘‘బై నవ్ పే లేటర్’’ ఫ్లాట్‌ఫారం అయిన జెస్ట్‌మనీతో భాగస్వామ్యం చేసుకుంది.

 ఈ పార్టనర్‌షిప్ గతంలో సిబిల్ స్కోరు లేని ఖాతాదారులకు సైతం ఒకినావా ప్రొడక్ట్‌లు కొనుగోలు చేయడానికి ఫైనాన్సింగ్ ఆప్షన్‌ పొందేందుకు సహాపడింది. ఖాతాదారులు డిజిటల్ కెవైసి పూర్తి చేసి, కొనుగోలు సమయంలో వారి సౌకర్యవంతమైన తిరిగి చెల్లించే ప్లాన్ ఎంచుకోవడం ద్వారా జెస్ట్ మనీ నుంచి క్రెడిట్ లిమిట్‌ని ఉపయోగించుకోవచ్చు. 
ఈ ప్రక్రియ పూర్తిగా పేపర్‌లెస్, ఫిజికల్ మీటింగ్ లేకుండానే పూర్తిగా ఆన్‌లైన్‌లో చేయవచ్చు.

ఈ ఫెసిలిటీ పాన్ ఇండియాలోని 350కి పైగా ఒకినావా డీలర్‌షిప్‌ల వద్ద లభ్యమవుతుంది. దీనికి అదనంగా, ఖాతాదారులు ఒకినావా వెబ్‌సైట్ ద్వారా ప్రొడక్ట్‌ని ఆన్‌లైన్‌లో బుక్ చేసేటప్పుడు కూడా సర్వీస్‌ని ఉపయోగించుకోవచ్చు. ఈ భాగస్వామ్యం ఖాతాదారుల సామర్థ్యాన్ని పెంచడం, అలానే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను సొంతం చేసుకోవాలనే వారి నిర్ణయానికి దగ్గరగా ఉంటుందని భావిస్తున్నారు. 

‘కరోనా మహమ్మారి కారణంగా చాలామంది ఇతరులతో కలిసి ప్రయాణాలను చేయడానికి సందేహిస్తున్నారు. ఇప్పుడు సామాజిక దూరం ఒక జీవిత విధానమైంది. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత వాహనాలను ఎంచుకుంటున్నారు. లాక్‌డౌన్ ఎత్తివేసిన ఒక నెలరోజుల్లోనే ఎలక్ట్రిక్ టూవీలర్స్ కొరకు డిమాండ్ పెరగడాన్ని మేం గమనించాం.

స్వంత వాహనాలను కొనుగోలు చేయడమే కాకుండా, ఐ‌సి‌ఈతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల వైపు మెగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తుంది. డబ్బు సమకూర్చుకోవడం కష్టంగా ఉన్న నేటి తరుణంలో, మా ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేవిధంగా ఫైనాన్స్‌ని ఎంచుకునేందుకు మేం జస్ట్‌మనీతో అసోసియేట్ అయ్యాం,” అని జితేందర్ శర్మ- ఒకినావా ఎమ్‌డి, కోఫౌండర్ తెలిపారు.

పార్టనర్‌షిప్‌పై  సిఈవో & జస్ట్‌మనీ కో ఫౌండర్ లిజ్జీ చాప్‌మన్ మాట్లాడుతూ “ఎలక్ట్రిక్ స్కూటర్‌లకు డిమాండ్ గణనీయంగా పెరిగిన ఈ నేపథ్యంలో ఒకినావాతో భాగస్వామ్యం చేసుకున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. సామాజిక దూరం కొనసాగడం వల్ల వ్యక్తులు ప్రయాణించే రీతిని కొవిడ్-19 మార్చింది.  

మా పే లేటర్ సర్వీస్ వారు స్వంత వాహనాన్ని కలిగి ఉండాలనే వారి కలను సాకారం చేస్తుంది. ఈ సమయంలో ప్రజలు ఫైనాన్స్‌లను ప్లాన్ చేయడాన్ని ఎంచుకోవడానికి ఈ సర్వీస్ మరింత కీలకం. కొనుగోలు చేయగల సామర్థ్యం ఈ కేటగిరీలో ఇప్పటికే డిమాండ్‌ని పెంచడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది, రాబోయే నెలల్లో ఇది మరింత గణనీయంగా పెరుగుతుంది.’’ అని అన్నారు.

కొవిడ్-19 వ్యాప్తి సమయంలో ఒకినావా ఖాతాదారులకు సురక్షితమైన ప్రక్రియలను ఆఫర్ చేయడానికి అనేక చర్యలు తీసుకుంటోంది. వారి ఇళ్ల నుంచి బయటకు రాకుండానే ప్రొడక్ట్‌లను బుక్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించడానికి ఒకినావా ఇటీవల ఆన్‌లైన్ బుకింగ్ ప్రారంభించింది. 

ఒకినావా గురించి: ఒకినావా జితేందర్ శర్మ-ఎమ్‌డి, శ్రీమతి రూపాలి శర్మ ఛైర్‌పర్సన్ ద్వారా 2015లో ప్రారంభించబడింది. ఒకినావా నేడు భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ ఆటోమొబైల్ కంపెనీల్లో ఒకటి. 

ఒకినావా ఫేమ్-II అప్రూవల్ పొందిన మొదటి కంపెనీ, ఇది ‘మేక్ ఇన్ ఇండియా’ మీద దృష్టి సారించే భారతీయ ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాల తయారీ సంస్థ. స్లో- స్పీడ్ ఈ- స్కూటర్‌లు అందించడం ద్వారా కంపెనీ భారతదేశంలో ఈ వాహనాల ఎదుగుదలకు దోహదపడుతోంది.

పెట్రోల్, డీజిల్ వాహనాలకు నిలకడగా చౌక ప్రత్యామ్నాయాలను సృష్టించడం ద్వారా,  కంపెనీ #PowertheChange అనే బ్రాండ్ లక్ష్యానికి దోహదపడుతోంది. కంపెనీ ప్రధాన కేంద్రం గుర్‌గావ్‌లో, తయారీ కేంద్రం భివాండీ, రాజస్థాన్‌లో ఉంది.


జెస్ట్ మనీ గురించి : లిజ్జీ చాప్‌మనన్, ప్రియా శర్మ, అశీష్ అనంతరామన్‌ల ద్వారా 2015లో ప్రారంభించిన జెస్ట్‌మనీ భారతదేశంలో అతిపెద్ద, అలానే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎఐ- ఆధారిత ఫైనాన్సింగ్, పేలేటర్ ప్లాట్‌ఫారం. ఫిన్‌టెక్ సంస్థ దేశంలో తగినంత క్రెడిట్ చరిత్ర లేకపోవడం వల్ల క్రెడిట్ కార్డులు లేదా ఇతర క్రెడిట్ ఫైనాన్సింగ్ పొందలేని 300 మిలియన్‌లకు పైగా కుటుంబాల జీవితాలను మెరుగుపరచగల వేదికగా నిర్మించబడింది, మిలియన్‌ల భారతీయ ఖాతాదారులకు మరింత కొనుగోలు సామర్థ్యం అందించడానికి జెస్ట్ మనీ ఒక ప్రత్యేకమైన  ఫ్లాట్‌ఫారం మొబైల్ టెక్నాలజీ, డిజిటల్ బ్యాంకింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగించుకుంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోవడానికి సందర్శించండి https://www.zestmoney.in/ 

Follow Us:
Download App:
  • android
  • ios