Asianet News TeluguAsianet News Telugu

టాటా మోటార్స్ చేతికి ఫోర్డ్ ఇండియా.. వందల కోట్లకు డీల్.. త్వరలో మరిన్ని కొత్త ఎలక్ట్రిక్ కార్లు..

జాబ్ ఆఫర్‌లను అంగీకరించిన ఫోర్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అర్హులైన ఉద్యోగులందరూ ఇప్పుడు మంగళవారం నుండి టాటా ప్యాసింజర్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్‌లో ఉద్యోగులుగా మారారు. ప్రస్తుతం, టాటా మోటార్స్ నెక్సాన్ ఈ‌వి, టిగోర్ ఈ‌వి తాజాగా లాంచ్ చేసిన టియాగో ఈ‌వి వంటి ఎలక్ట్రిక్ మోడళ్లను విక్రయిస్తోంది. 

Tata Motors officially completes acquisition of Ford India plant will increase EV lineup
Author
First Published Jan 11, 2023, 2:02 PM IST

టాటా ప్యాసింజర్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ మంగళవారం గుజరాత్‌లోని సనంద్‌లో పాత ఫోర్డ్ ఇండియా ప్లాంట్ కొనుగోలును అధికారికంగా పూర్తి చేసింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) ఫైలింగ్‌లో సనంద్ అసెట్స్ అండ్ వి‌ఎం ప్లాంట్ & మెషినరీ కొనుగోలు కోసం లావాదేవీని పూర్తి చేసినట్లు కంపెనీ తెలియజేసింది. 

జాబ్ ఆఫర్‌లను అంగీకరించిన ఫోర్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అర్హులైన ఉద్యోగులందరూ ఇప్పుడు మంగళవారం నుండి టాటా ప్యాసింజర్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్‌లో ఉద్యోగులుగా మారారు. ఈ కొనుగోలులో ఉద్యోగుల సర్వీసెస్, మొత్తం భూమి, గతంలో ఫోర్డ్ ఇండియాకు చెందిన భవనం అలాగే వాహన తయారీ ప్లాంట్‌ను రూ. 725.7 కోట్లకు పన్నులు మినహాయించి ఉన్నాయి. 

టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాలపై పెద్ద ఎత్తున పోటీ చేస్తోంది ఇంకా భారతీయ ఆటోమోటివ్ మార్కెట్లో ఇప్పటికే  ప్రముఖ వాటాను స్వాధీనం చేసుకుంది. ఫోర్డ్ ప్లాంట్‌ను కొనుగోలు చేయడంతో కంపెనీ వార్షిక తయారీ సామర్థ్యాన్ని మూడు లక్షల యూనిట్లకు పెంచుకోవాలని చూస్తోంది, అంటే దీనిని 4.20 లక్షల యూనిట్లకు పెంచవచ్చు. 

ప్రస్తుతం, టాటా మోటార్స్ నెక్సాన్ ఈ‌వి, టిగోర్ ఈ‌వి తాజాగా లాంచ్ చేసిన టియాగో ఈ‌వి వంటి ఎలక్ట్రిక్ మోడళ్లను విక్రయిస్తోంది. రాబోయే ఆటో ఎక్స్‌పో 2023లో కంపెనీ ప్రస్తుతం ఉన్న 'రెగ్యులర్' వాహనాల నుండి మరిన్ని ఎలక్ట్రిక్ మోడళ్లను ప్రదర్శిస్తుందని తెలిపింది. ప్రదర్శించనున్న ఈ‌వి వెర్షన్‌ల లిస్ట్ లో సఫారి, హారియర్, పంచ్ అలాగే ఆల్ట్రోజ్ ఉన్నాయి. 

టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్ల రంగంలో ఒక ముఖ్య పోటీదారిగా స్థిరపడింది, ఈ విషయంలో  ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోకి దగ్గరగా డైరెక్ట్ పోటీదారులు ఎవరూ లేరు. మారుతి సుజుకి 2025 సంవత్సరానికి కంటే ముందు ఎలాంటి EVని ప్రవేశపెట్టే అవకాశం లేదు. హ్యుందాయ్, కియా మోటార్స్ వంటి ఇతర వాహన తయారీదారులు 50 లక్షల కంటే ఎక్కువ ధరతో హై ఎండ్ మోడళ్ల కార్లు ఉండనున్నాయి.

కానీ ఎం‌జి మోటార్ ఇండియా అండ్ సిట్రోయెన్ క్యాంపులలో కొంత కదలిక ఉంది. ఎం‌జి మోటార్  ఎం‌జి ఎయిర్ EVని ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించనుంది, దీని ధర రూ. 10 లక్షల నుండి రూ. 12 లక్షల మధ్య ఉండవచ్చు. Citroen ఆటో ఎక్స్‌పోలో పాల్గొననప్పటికీ,  C3 కాంపాక్ట్ వాహనం  ఎలక్ట్రిక్ వెర్షన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios