మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ ‘మైక్రోమాక్స్’ అనుబంధ రివోల్ట్ ఇంటెల్లీ కార్స్ ఆధ్వర్యంలో  ‘ఆర్‌వీ 400’ పేరుతో తొలి 'ఏఐ' ఎలక్ట్రిక్‌ బైక్‌ చేపట్టనున్నది. దీంతో ఈ నెల 28వ తేదీన అధికారికంగా మార్కెట్లోకి విడుదల కానున్నది.

స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ మైక్రోమాక్స్‌ సహ-వ్యవస్థాపకుడు రాహుల్‌ శర్మకు చెందిన ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌ స్టార్టప్‌ ‘రివోల్ట్‌ ఇంటెల్లీకార్ప్‌’ తన తొలి వాహనాన్ని విపణిలోకి విడుదల చేయనుంది. ‘ రివోల్ట్‌ ఆర్‌వీ 400’ పేరుతో పరిచయం చేసిన ఈ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌ను ఈ నెల 28వ తేదీన ఆవిష్కరించనున్నామని రివోల్ట్‌ ఇంటెల్లీకార్ప్‌ వ్యవస్థాపకులు రాహుల్‌ శర్మ ట్వీట్ చేశారు. 

దేశంలో తొలిసారిగా కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీ ఆధారంగా రూపొందించిన ఈ బైక్‌ను ఒకసారి పూర్తిగా చార్జ్‌ చేస్తే 156 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఆర్‌వీ 400 బ్యాటరీని 4 గంటల్లో పూర్తిగా చార్జ్‌ చేసుకోవచ్చు. ఢిల్లీ వినియోగదారుల కోసం రూ.1000లతో జూన్ 25 నుంచి బుకింగ్స్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

వచ్చే నాలుగు నెలల్లో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, పుణె, బెంగళూరు, హైదరాబాద్‌, నాగ్‌పూర్‌, అహ్మదాబాద్‌, చెన్నై మార్కెట్లోకి ఈ వాహనాన్ని విడుదల చేయనుంది. అలాగే చార్జింగ్‌ కోసం కంపెనీ ఆన్‌బోర్డ్‌, పోర్టబుల్‌ చార్జింగ్‌ ఫీచర్లను ఆఫర్‌ చేస్తోంది. ఈ సంస్థ హర్యానాలోని మనేసర్‌ యూనిట్‌లో ఏటా 1.2 లక్షల వాహనాల ఉత్పత్తి సామర్థ్యంతో కూడిన ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్టు కంపెనీ ప్రకటించింది.