Asianet News TeluguAsianet News Telugu

నిస్సాన్‌ కారు కొంటే వరల్డ్ కప్ వీక్షించే సదవకాశం...

భారత్ మార్కెట్లో ఆవిష్క్రుతమైన నిస్సాన్ న్యూ మోడల్ కారు కిక్స్ ఎస్‌యూవీ కొనుగోలు దారులకు బంపర్ ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది. తొలి 500 కార్లు బుకింగ్ చేసుకున్న వారికి ఇంగ్లండ్‌లో జరిగే ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీని వీక్షించే అవకాశం కల్పించనున్నది. 
 

New 2019 Nissan Kicks SUV launched at Rs 9.55 lakh in India
Author
New Delhi, First Published Jan 23, 2019, 10:30 AM IST

న్యూఢిల్లీ: నిస్సాన్‌ మోటార్‌ ఇండియా కొత్త ఎస్‌యూవీ మోడల్ కం సబ్ కంపాక్ట్ కారు 'కిక్స్'ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఎక్స్‌ఎల్‌, ఎక్స్‌వీ, ఎక్స్‌వీ ప్రీమియం, ఎక్స్‌వీ ప్రీమియం ప్లస్‌ అనే నాలుగు వెర్షన్లలో కారు మార్కెట్లో అందుబాటులోకి రానున్నది.

కిక్స్ కోసం గత నెలలోనే ప్రీ బుక్సింగ్స్‌ మొదలుపెట్టింది. ఈ నెలాఖరులోగా ప్రీ బుకింగ్‌ చేసుకున్న తొలి 500మంది వినియోగదారులకు బంపర్‌ ఆఫర్‌ ఇస్తోంది. ఇంగ్లాండ్‌లో జరిగే  ఐసీసీ  క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ను వీక్షించే సువర్ణావకాశాన్ని దక్కించుకునే ఛాన్స్‌ ఉన్నదని నిస్సాన్‌ ఇండియా ప్రకటించింది.

నిస్సాన్ తన ప్రధాన ప్రత్యర్థులు హ్యుండాయ్‌ క్రెటా, రెనాల్ట్‌ డస్టర్‌, మారుతి ఎస్‌-క్రాస్‌ మోడల్ కార్లకు ధీటుగా కిక్ మోడల్ సబ్ కంపాక్ట్ ఎస్‌యూవీ కారును అందుబాటులోకి తెచ్చింది. ఎక్స్‌ఎల్‌ పెట్రోల్ బేసిక్‌ వేరియంట్ ధర రూ.9.55 లక్షలుగా నిర్ణయించింది.

నిస్సాన్ కిక్స్ బేసిక్‌ వేరియంట్‌లో కూడా ఎడ్జస్టబుల్‌ డ్రైవర్ సీటు, పవర్ విండోస్, ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెనుక ఎసీ,వెంట్స్ నాలుగు స్పీకర్లతో ఒక బ్లూటూత్, యూఎస్బీ, ఆక్స్‌- ఎనేబుల్ ఆడియో సిస్టమ్ లాంటి  కీలక ఫీచర్లను పొందుపర్చింది. 

ఇక టాప్‌ ప్రీమియం ప్లస్‌లో ఎరౌండ్‌ వ్యూ డిస్‌ప్లే కలిగిన 360 డిగ్రీ కెమెరాతోపాటు ఆండ్రాయిడ్‌ ఆటో అండ్‌ ఆపిల్ కార్‌ ప్లే కంపాటిబిలిటీ ఇచ్చింది. టెలీమాటిక్స్-ఎనేబుల్ స్మార్ట్ వాచ్, స్టీరింగ్-మౌంటెడ్‌ కంట్రెల్స్‌ , 8.0 అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఎల్‌ఈడీ హెడ్‌ లాంప్స్‌  క్రూయిస్ కంట్రోల్, పుష్-బటన్  స్టార్ట్‌, ఆటోమేటిక్ హెడ్‌ ల్యాంప్స్‌, వైపర్లను  జోడించింది. ఎక్స్‌టీరియర్‌గా స్టయిలుష్‌ లుక్‌ను జత చేసింది. 

17ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ ,  హిల్ స్టార్ట్ అసిస్ట్‌, నిస్సాన్ ఇంటెలిజెంట్ మొబిలిటీ తదితర ఫీచర్లు​ నిస్సాన్‌ కిక్స్‌  ఎస్‌యూవీ సొంతం అని పేర్కొంది. ఈ వాహనాల్లో 1.5 లీటర్ల పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్లను అమర్చింది. పెట్రోల్‌ ఇంజిన్‌ 105బీహెచ్‌పీ పవర్‌ వద్ద 142 గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. డీజిల్‌ ఇంజిన్‌ 108 బీహెచ్‌పీ వద్ద 240 గరిష్ట్‌ టార్చ్‌ను ప్రొడ్యూస్‌ చేస్తుంది. 

పెట్రోల్‌ వేరియంట్‌‌లో కిక్స్‌ ఎక్స్‌ఎల్‌ మోడల్  రూ. 9.55 లక్షలు, కిక్స్‌ ఎక్స్‌వీ మోడల్ రూ. 10.95 లక్షలు పలుకుతోంది. ఇక డీజిల్ వేరియంట్‌లో కిక్స్‌ ఎక్స్‌ఎల్‌ ధర - రూ. 10.85 లక్షలు, కిక్స్‌ ఎక్స్‌వీ- రూ.12.49లక్షలకు లభిస్తోంది. మరోవైపు కిక్స్‌ ఎక్స్‌వీ ప్రీమియం రూ.13.65 లక్షలకు లభిస్తుండగా, కిక్స్‌ ఎక్స్‌వీ ప్రీమియం  ప్లస్‌ మోడల్ కారు రూ.14.65లక్షలకు అందుబాటులో ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios