Asianet News TeluguAsianet News Telugu

బడ్జెట్ 2021-22: పాత వాహనాలకు జంక్ పాలసీని ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి.. అదేంటో తెలుసుకోండి..

 కొత్త వాహన జంక్ పాలసీ విధానం ప్రకారం, 15 ఏళ్ల వాణిజ్య వాహనాలు స్క్రాప్ చేయబడతాయి, అంటే వాటిని రోడ్లపై నడపడానికి అనుమతించరు. వ్యక్తిగత వాహనం కాలాన్ని 20 సంవత్సరాలుగా నిర్ణయించారు. 

Budget 2021-22: Finance Minister introduces vehicle  junk policy for old vehicles  know more here
Author
Hyderabad, First Published Feb 2, 2021, 12:13 PM IST

2021-22 బడ్జెట్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వెహికల్ జంక్ పాలసీ (వెహికల్ స్క్రాప్ పాలసీ)ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కొత్త వాహన జంక్ పాలసీ విధానం ప్రకారం, 15 ఏళ్ల వాణిజ్య వాహనాలు స్క్రాప్ చేయబడతాయి, అంటే వాటిని రోడ్లపై నడపడానికి అనుమతించరు.

వ్యక్తిగత వాహనం కాలాన్ని 20 సంవత్సరాలుగా నిర్ణయించారు. అంటే, పాత వాహనాలను ఇప్పుడు 20 సంవత్సరాలు గడిచిపోతే తరువాత వాటిని స్క్రాప్ చేయవచ్చు.  పాత వాహనాలు  కాలుష్యానికి కారణమవుతాయి. పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించే దిశగా ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.

ఇది పర్యావరణ అనుకూల వాహనాలను ప్రోత్సహిస్తుంది. కాలుష్యాన్ని తగ్గించడానికి, చమురు దిగుమతి కూడా తగ్గించడానికి సహాయపడుతుంది.  వెహికల్ జంక్ పాలసీ కోసం ప్రతి చోట ఆటోమేటెడ్ ఫిట్‌నెస్ కేంద్రాలు నిర్మించబడతాయి.

ప్రైవేట్ వాహనాలను 20 సంవత్సరాల తరువాత, వాణిజ్య వాహనాలను 15 సంవత్సరాల తరువాత  ఈ ఆటోమేటెడ్ ఫిట్‌నెస్ కేంద్రాలకు తీసుకెళ్లాలి. ఈ పథకం పూర్తి వివరాలను మంత్రిత్వ శాఖ విడిగా విడుదల చేయనుంది. 

గత కొన్ని రోజులుగా వెహికల్ జంక్ పాలసీపై ప్రభుత్వం  కృషి చేస్తుంది. కొద్ది రోజుల క్రితం రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ  వెహికల్ జంక్ పాలసీకి ఆమోదం తెలిపారు. అలాగే, పాత వాహనాలను వ్యర్థాలకు ఇవ్వడానికి బదులుగా, కొత్త వాహనాలను కొనడానికి ప్రభుత్వం ప్రోత్సాహకం కూడా ఇస్తుంది.  

2022 ఏప్రిల్ 01 నుండి కొత్త పాలసీ 
ఈ విధానం ప్రైవేట్ వాహనాలకు మాత్రమే కాదు, ప్రభుత్వ, పిఎస్‌యు వాహనాలను కూడా వర్తిస్తుంది. ప్రభుత్వ వాహనాల కోసం 15 సంవత్సరాలు గల వాహనాలను స్క్రాప్ చేసే విధానాన్ని ఇటీవల రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఆమోదించింది.

మంత్రిత్వ శాఖ  ఈ నిర్ణయం తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిఎస్‌యుల కంపెనీలలో ఉపయోగించే 15 ఏళ్ల వాహనాలు తొలగించబడతాయి. ఈ విధానం అమలుకు ముందు 2022 ఏప్రిల్ 01న నోటిఫికేషన్ జారీ చేయబడుతుందని అంచనా. 

వెహికల్ జంక్ పాలసీ కోసం 2019 జూలైలో మోటారు వాహన చట్టాన్ని సవరించారు. దీని కింద, పాత వాహనాలను తొలగించి, కొత్త సురక్షితమైన, తక్కువ కాలుష్య వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించే విధానం రూపొందించబడింది. 

వెహికల్ జంక్ పాలసీ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి ?
1.కొత్త వెహికల్ జంక్ పాలసీని ప్రవేశపెట్టడం వల్ల భారతదేశంలో వాయు కాలుష్యం స్థాయి చాలా వరకు తగ్గుతుంది.
2.కొత్త వాహనాలకు డిమాండ్ పెరిగేకొద్దీ  దేశ ఆటోమొబైల్ రంగానికి కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. వాహనాల్లో భద్రతను కాపాడుకునే కొత్త భద్రతా ప్రమాణాలను ప్రభుత్వం నిరంతరం అమలు చేస్తోంది, ఈ విధానం పాత అసురక్షిత వాహనాలను తొలగిస్తుంది.
3. కొత్త భద్రతా ప్రమాణాలతో వాహనాలలో  రహదారిపై ప్రయాణించడం ప్రయాణాన్ని సురక్షితంగా చేస్తుంది.
4. ఇది కాకుండా, చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలని ప్రభుత్వం కోరుకుంటుంది. ఎలక్ట్రిక్ వాహనాల తీసుకురావడం ద్వారా ప్రభుత్వం ఈ లక్ష్యాన్ని నెరవేరుస్తుంది.

మంచి నిర్వహణ ఉన్నప్పటికీ కాలుష్యం
గత కొన్ని సంవత్సరాలుగా భారత వాహన మార్కెట్ చాలా ఊపందుకుంది. పాత కాలుష్య ఉద్గార ప్రమాణాలతో పోల్చితే, 2005 నుండి పాత వాహనాలు కొత్త ప్రమాణాల కంటే 10 నుండి 25 శాతం ఎక్కువ కాలుష్యాన్ని పెంచుతున్నాయి.

ఈ వాహనాలను జాగ్రత్తగా నిర్వహించినప్పటికీ, అవి ఉద్గార ప్రమాణాల కంటే ఎక్కువ కాలుష్యాన్ని కలిగిస్తాయి. రహదారి భద్రతకు కూడా ఇది  హానికరం.

Follow Us:
Download App:
  • android
  • ios