Asianet News TeluguAsianet News Telugu

08మార్చి 2019 శుక్రవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

toady march 8th your horoscope
Author
Hyderabad, First Published Mar 8, 2019, 7:59 AM IST

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : అనారోగ్య సమస్యల ఉంటా యి. ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్త వహించాలి. అన్ని పనుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. విద్య నేర్చుకోవడం వల్ల వచ్చే గౌరవం పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యకలాపాలపై దృష్టి సారిస్తారు. అన్ని పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికంగా ఉంటుంది. వీరు విష్ణు సహస్రనామాన్ని నిరంతరం వింటూ ఉండాలి.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : ఊహించని ఇబ్బందులు వస్తాయి. అనవసర ఖర్చులు చేస్తారు. వైద్యశాలల సందర్శనం చేస్తారు. లాభనష్టాలపై సమాన దృష్టి ఉంటుంది. ఇతరులపై ఆధారపడతారు. శ్రమలేని సంపాదనపై దృష్టి ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. విష్ణు సహస్రనామాన్ని నిరంతరం వింటూ ఉండాలి.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : పరస్పర సహకారం లభించదు. సామాజిక అనుబంధాల్లో లోపాలు ఉంటా యి. నూతన పరిచయస్తులతో అప్రమత్తత అవసరం. మోసపోయే అవకాశం ఉంటుంది. భాగస్వాములు జాగ్రత్త అవసరం. వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాలి. విష్ణు సహస్రనామాన్ని నిరంతరం వింటూ ఉండాలి.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : సంతృప్తి లభిస్తుంది. పోీల్లో గెలుపు సాధిస్తారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. వృత్తి విద్యలో రాణింపు ఉంటుంది. రోగనిరోధక శక్తి ఉంటుంది. వ్యాయామం అవసరం. విష్ణు సహస్రనామ పారాయణం మంచి ఫలితాలనిస్తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. సంతానం వల్ల సమస్యలు ఏర్పడతాయి. విద్యార్థులు అధిక శ్రమతో తక్కువ ఫలితాలు సాధిస్తారు. గుర్తింపు ఉండదు. ఆత్మీయత లోపిస్తుంది. సృజనాత్మకత కోల్పోతారు. కళలపై ఆసక్తి తగ్గుతుంది. ఆలోచనల్లో వైవిధ్యం ఏర్పడుతుంది. విష్ణు సహస్రనామ పారయణం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : సౌకర్యాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. తీసుకునే ఆహారం జాగ్రత్తగా ఉండాలి. అజీర్ణ సమస్యలు వచ్చే సూచనలు. ఆహారంలో సమయపాలన అవసరం. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. కార్యాలయాల్లో అప్రమతత్త అవసరం. బద్ధకాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. శ్రీరామజపం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సేవకజన సహకారం లభిస్తుంది. రచనలపై ఆసక్తి పెరుగుతుంది. దగ్గరి ప్రయాణాలపై దృష్టి పెడతారు. ప్రయాణాల్లో సంతోషం కనిపిస్తుంది. సహోద్యోగులతో అనుకూలత ఏర్పడుతుంది. కమ్యూనికేషన్స్‌ వల్ల అనుకూలత ఉంటుంది. విద్యార్థులు తక్కువ శ్రమతో ఫలితాలు సాధిస్తారు.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : మాటల వల్ల ఇబ్బందులు ఎదుర్కొటా ంరు. కుటుంబంలో అలజడి ఏర్పడుతుంది. మధ్యవర్తిత్వాలు, వాగ్దానాలు చేయరాదు. నిల్వ ధనాన్ని కోల్పోయే ప్రమాదం. విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తత అవసరం. కిం సంబంధ లోపాలకు అవకాశం.  క్రీం అచ్యుతానంత గోవింద జపం చేసుకోవడం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : శారీరక శ్రమ అధికం. పట్టుదలతో కార్యసాధన అవసరం. చిత్త చాంచల్యం పెరుగుతుంది. ప్రణాళికాబద్ధమైన లోపాలు ఉంటా యి. ఆలోచనల్లో మార్పులు వస్తాయి. ఔషధసేవనం తప్పనిసరి.  అనవసర ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. క్రీం అచ్యుతానంత గోవింద జపం చేసుకోవడం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : విశ్రాంతికోసం ప్రయత్నిస్తారు. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. అనవసర ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగస్తులను స్థాన చలనం ఉంటుంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది.  సుఖంకోసం ప్రయత్నిస్తారు. అన్ని రకాల ఖర్చులు ఉంటా యి. ఇతరులపై ఆధారపడతారు. శ్రీరామ జపం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : శ్రమలేని సంపాదనపై ఆలోచన పెరుగుతుంది. సమిష్టి ఆశయాలు ఉంటా యి. సేవకులద్వారా ఆదాయాలు వస్తాయి. సంఘవ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ఇతరులపై ఆధారపడి ఉంటా రు. అన్ని రకాల లోపాలు ఉరాయి. శ్రీరామజయరామ జయజయరామరామ జపం చేసుకోవడం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. సంఘంలో గౌరవంకోసం ఆరాటం. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ధోరణి ఏర్పడుతుంది. పెద్దలంటే గౌరవం ఉంటుంది. రాజకీయాలపై దృష్టి సారిస్తారు. గౌరవం పెంచుకునే ప్రయత్నం. అధికారులతో అననుకూలత ఉంటుంది. సేవకులతో అనుకూలత ఉంటుంది. శ్రీరామజపం.

డా.ఎస్.ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios