Asianet News TeluguAsianet News Telugu

కార్తీక మాసంలో పాటించాల్సిన నియమాలు

నూనెతో వండిన పదార్థాలు, ఉసిరికాయ పనికిరావు. పితృతర్పణాలు చేయాలి, దానం శక్తికి ఉన్నంత. అష్టవసువులు, పితృదేవతల పూజ, ఓం అమృతాయ స్వాహా, పితృదేవతాభ్యోనమః మంత్ర జపం మంచిది, దీని వలన ఆత్మరక్షణ, సంతాన రక్షక కలుగుతుంది.

rules to follow in karthika masam
Author
Hyderabad, First Published Nov 6, 2019, 7:52 AM IST

మొది రోజు : ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్లని వస్తువులు వదిలి వేయాలి. నెయ్యి, బంగారం దానం చేయాలి. పూజించే దేవత : స్వథా అగ్ని, జపించాల్సిన మంత్రం: ఓం జాతవేదసే స్వథాపతే స్వాహా, ఇవి చేయడం వలన తేజో వర్ధనం కలుగుతుంది.

రెండవరోజు : తరిగిన కూరగాయలు వదిలివేయాలి. కలువపూలు, నూనె, ఉప్పు దానం చేయాలి. బ్రహ్మను పూజించాలి. ఓం గీప్పతయే విరించియే స్వాహా మంత్రం జపించాలి. దీని వలన  మనస్సు స్థిమితం ఏర్పడుతుంది.

మూడవరోజు : ఉప్పు కలిసిన పదార్థాలు, ఉసిరికాయ వదిలివేయాలి. ఉప్పు దానం చేయాలి. పార్వతిదేవిని ఆరాధించాలి. ఓం పార్వత్యై పరమేశ్వర్యై స్వాహా మంత్రం జపించాలి. దీని వలన శక్తి సౌభాగ్యం లభిస్తాయి.

నాల్గవరోజు : వంకాయ, ఉసిరికాయ పనికిరావు. నూనె, పెసరపప్పు దానం చేయాలి. విఘ్నేశ్వర ఆరాధన, ఓం గం గణపతయే స్వాహా మంత్ర జపం చేయాలి. దీనివలన సద్బుద్ధి, కార్యసిద్ధి కలుగుతాయి.

ఐదవరోజు : పులుపుతో ఉన్న వస్తువులు పనికిరావు. స్వయంపాకం, విసనకర్ర దానం ఇవ్వాలి. ఆదిశేషుడిని పూజించాలి.  ప్రాణాయామం చేయాలి. దీని వలన కీర్తి కలుగుతుంది.

6వ రోజు : ఇష్టమైన పదార్థాలు, ఉసిరి పనికిరాదు. చిమ్మిలి దానం చేయాలి. సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధన, ఓం సుం, బ్రం. సుబ్రహ్మణ్యాయ స్వాహా మంత్ర జపం చేయాలి. దీని వలన సర్వకార్యసిద్ధి, సత్సంతానం, జ్ఞానలబ్ధి కలుగుతాయి.

7వ రోజు : పింతో తినే వస్తువులు, ఉసిరి పనికిరావు. పట్టుబట్టలు, గోధుమల, బంగారం దానం చేయాలి. రవిని పూజించాలి. ఓం భాం, భానవే స్వాహా జపం చేయాలి. తేజస్సు, మంచి ఆరోగ్యం కలుగుతాయి.

8వ రోజు : ఉల్లి, ఉసిరి, మద్యం, మాసం  పనికిరావు. ఎవరి శక్తికి తగినంత వారు దానం చేయవచ్చు.దుర్గాదేవి ఆరాధన, ఓం చాముండాయై విచ్చే స్వాహా జపం చేయాలి. దీనివలన చేసే పనుల్లో ధైర్యం, అన్ని పనుల్లో విజయం సాధిస్తారు.

9వరోజు : నూనెతో వండిన పదార్థాలు, ఉసిరికాయ పనికిరావు. పితృతర్పణాలు చేయాలి, దానం శక్తికి ఉన్నంత. అష్టవసువులు, పితృదేవతల పూజ, ఓం అమృతాయ స్వాహా, పితృదేవతాభ్యోనమః మంత్ర జపం మంచిది, దీని వలన ఆత్మరక్షణ, సంతాన రక్షక కలుగుతుంది.

10వరోజు : గుమ్మడికాయ, నూనె, ఉసిరి పనికిరావు. గుమ్మడికాయ, స్వయంపాకం, నూనె దానం చేయాలి. దిగ్గజాలను పూజించాలి.

11వరోజు : పులుపు పదార్థాలు ఉసిరికాయ తినకూడదు. విభూదిపండ్లు దానం చేయాలి. ఓం రుద్రాయస్వాహా ఓం నమశ్శివాయ జపం చేయాలి. దీని వలన ధనప్రాప్తి, పదవులు ఏమైనా ఆశిస్తే అవి లభిస్తాయి.

12వ రోజు. ఉప్పు, పులుపు, కారం, ఉసిరికాయ పనికిరావు. పరిమళ ద్రవ్యాలు, స్వయం పాకం దానం ఇవ్వాలి. భూదేవీ సహిత విష్ణుమూర్తి లేకపోతే కార్తీక దామోదరుని పూజ, ఓం భూర్భువర్విష్ణవే వరాహాయ కార్తీక దామోదరాయ స్వాహా జపం అవసరం. దీని వలన బంధ విముక్తి కలుగుతుంది. ధన ధాన్యాలు కలుగుతాయి.

13వ రోజు : రాత్రిభోజనం చేయకూడదు. ఉసిరికాయ పనికిరావు. మల్లెపూలు, జాజిపూలు, అన్నదానం చేయాలి. మన్మథ పూజ, ఓం శ్రీ విరిశరాయ నమఃస్వాహా జపం చేయాలి. దీనివలన వీర్యవృద్ధి సౌందర్యం కలుగుతాయి.

14వ రోజు : ఇష్టమైన వస్తువులు ఉసిరికాయ వదిలాలి. నువ్వులు, ఇనుము, దున్నపోతు దానం చేయాలి.  యముడిని పూజించాలి. ఓం తలప్రియాయ సర్వ సంహారహేతినే స్వాహా జపం. దీనివలన అకాల మృత్యువు తొలగుతుంది.

15వ రోజు : తరబడిన వస్తువులు వదిలివేయాలి. కలువపూలు, నూనె ఉప్పు దానం చేయాలి. ఓం తులసిథాత్రీ కార్తీక దామోదర స్వాహా జపం చేయాలి. దీనివలన సర్వకార్యసిద్ధి, పనుల్లో జయం చేకూరుతాయి.

డా.ఎస్.ప్రతిభ
Follow Us:
Download App:
  • android
  • ios