April 2025: ఏప్రిల్ నుంచి ఈ 3 రాశుల వారికి తిరుగేలేదు..! ఇంట్లో డబ్బే డబ్బు...!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురుడు కొన్ని రోజుల్లో నక్షత్ర రాశిని మారబోతున్నాడు. గురుడు ఈసారి కుజుడి నక్షత్ర రాశిలోకి ప్రవేశిస్తాడు. గురు సంచారం 3 రాశుల వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది. మరి ఆ రాశులెంటో చూద్దాం పదండి.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవ గ్రహాల్లో గురు గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. గురుడు తన నిర్దిష్ట సమయంలో నక్షత్ర రాశులు, రాశిచక్ర గుర్తులను మారుస్తాడు. ఈ మార్పు ప్రతి రాశిపై ప్రభావం చూపుతుంది. గురు సంచారం వల్ల కొన్ని రాశులవారికి మంచి జరుగుతుంది. మరి ఏ రాశుల వారికి మేలు జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
పంచాగం ప్రకారం గురు గ్రహం ఏప్రిల్ 10, 2025 నుంచి నక్షత్ర రాశిని మారుస్తుంది. ఏప్రిల్ 10న సాయంత్రం 7.51 గంటలకు గురుడు మృగశిర నక్షత్రంలోకి సంచరిస్తాడు. ఈ నక్షత్ర రాశికి అధిపతి కుజుడు. కుజుడి నక్షత్ర రాశిలోకి గురుడి ప్రవేశం వల్ల 3 రాశుల వారికి ప్రయోజనం చేకూరుతుంది. ఆ మూడు రాశులు ఏంటో ఇప్పుడు చూద్దాం.
వృషభ రాశిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
జ్యోతిష్యం ప్రకారం వృషభ రాశి వారికి గురు సంచారం శుభప్రదం. ప్రతి రంగంలోనూ సమస్యలు తొలగిపోతాయి. ప్రస్తుతం ఉన్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. వృత్తి జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషం, శాంతి నెలకొంటాయి. తండ్రితో ఉన్న విభేదాలు పరిష్కారమవుతాయి. ఒంటరి వ్యక్తులకు వివాహాలు కూడా కుదురుతాయి.
కర్కాటక రాశిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
గురుదేవుడి దయ కర్కాటక రాశి వారిపై కూడా ఉంటుంది. ఉన్నతాధికారులతో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. పనిలో ఆనందాన్ని పొందుతారు. జీతం పెరిగే అవకాశం ఉంది. మానసిక ఆందోళన తగ్గుతుంది. వ్యాపారంలో లాభం పెరుగుతుంది. కుటుంబ వాతావరణం బాగుంటుంది.
మకర రాశిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
మకర రాశి వారు కూడా గురుడి ఆశీర్వాదం పొందుతారు. భౌతిక సుఖం పెరుగుతుంది. ఈ సమయంలో ఆహారంపై శ్రద్ధ వహించడం అవసరం. ఆస్తిని కొనుగోలు చేయవచ్చు. గురు గ్రహ సంచారంతో వ్యాపారులకు లాభం వస్తుంది. వివాహ ప్రతిపాదనలు కూడా రావచ్చు. దంపతుల మధ్య ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రేమ, అనుబంధాలు పెరుగుతాయి.