వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు అసెంబ్లీలో శుక్రవారం నాడు సంచలన కామెంట్స్ చేశారు. తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. పార్టీ ఫిరాయింపుల అంశంపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు.


అమరావతి: ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు తన పదవికి రాజీనామా చేస్తానని శుక్రవారం నాడు అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

శుక్రవారం నాడు అసెంబ్లీలో గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు పార్టీ ఫిరాయింపులపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై చర్చ జరగకపోతే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.

ఈ విషయమై అసెంబ్లీలో చర్చ జరగాలని ఆయన కోరారు. గత ప్రభుత్వ హాయంలో చోటు చేసుకొన్న పరిణామాలను ఆయన ప్రస్తావించారు. అన్నా రాంబాబు కు మంత్రి అనిల్ కుమార్ కూడ మద్దతుగా నిలిచారు. ఈ విషయమై చర్చ జరగాలని ఆయన కూడ అభిప్రాయపడ్డారు.

అయితే ఈ విషయంలో స్పీకర్ తమ్మినేని సీతారాం జోక్యం చేసుకొన్నారు. పార్టీ ఫిరాయింపుల విషయమై సభా నాయకుడితో చర్చించి నిర్ణయం తీసుకొందామని ప్రకటించారు. దీంతో రాంబాబు మెత్తబడ్డారు.