Asianet News TeluguAsianet News Telugu

గంజాయి స్మగ్లింగ్.. జగన్‌పై వ్యాఖ్యలు: టీడీపీ నేత పట్టాభి ఇంటిలో వైసీపీ కార్యకర్తల బీభత్సం

విజయవాడలోని తెలుగుదేశం పార్టీ (telugu desam party) నేత కొమ్మారెడ్డి పట్టాభి (kommareddy pattabhi) ఇంటిపై వైసీపీ (ysrcp) నేతలు దాడి చేశారు. ఆయన ఇంట్లోని సామాగ్రిని వైసీపీ నేతలు, కార్యకర్తలు ధ్వంసం చేశారు.

ysrcp activists attack on tdp leader kommareddy pattabhi house
Author
Vijayawada, First Published Oct 19, 2021, 5:41 PM IST

విజయవాడలోని తెలుగుదేశం పార్టీ (telugu desam party) నేత కొమ్మారెడ్డి పట్టాభి (kommareddy pattabhi) ఇంటిపై వైసీపీ (ysrcp) నేతలు దాడి చేశారు. ఆయన ఇంట్లోని సామాగ్రిని వైసీపీ నేతలు, కార్యకర్తలు ధ్వంసం చేశారు. ప్రెస్‌మీట్ సందర్భంగా సీఎం జగన్,  ప్రభుత్వంపై పట్టాభి వ్యాఖ్యలకు నిరసనగానే వైసీపీ కార్యకర్తలు దాడికి తెగబడినట్లుగా తెలుస్తోంది. 

కాగా.. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబుకు (nakka ananda babu) పోలీసులు నోటీసులు అందించడంపై టీడీపీ (tdp) జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మంగళవారం ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. తాడేపల్లి ప్యాలెస్ పాలేరు ఆడమన్నట్టు పోలీసులు ఆడతారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వం గంజాయి స్మగ్లర్లకు కొమ్ము కాస్తుందని ఆరోపించారు. ఏపీ గంజాయికి అడ్డాగా (ganja cultivation in andhra pradesh) మారిందని.. అలాంటి పరిస్థితి లేకుంటే తెలంగాణ (telangana police), తమిళనాడు (tamilnadu police) పోలీసులు గంజాయి స్మగ్లర్లని పట్టుకోవడానికి ఏపీకి ఎందుకు వచ్చారని పట్టాభి ప్రశ్నించారు.

ALso Read:సజ్జలరామకృష్ణారెడ్డి గుమాస్తాకు తక్కువ, జీతగాడికి ఎక్కువ... కొమ్మారెడ్డి

నిన్న మధ్యాహ్నం మాదకద్రవ్యాలపై ఆనందబాబు మీడియా సమావేశంలో మాట్లాడితే అర్థరాత్రి పోలీసులు (ap police) ఆనందబాబు ఇంటికి రావడంపై పట్టాభిపై మండిపడ్డారు. నర్సీపట్నం నుంచి గుంటూరు రావడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అన్నింట్లో ఇంత మెరుపువేగంగా పోలీసులు స్పందిస్తే బాగుండునన్నారు. పక్కనున్న ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగు జరుగుతుంటే.. అక్కడికి వెళ్లే తీరికలేని పోలీసులు.. ఆనందబాబుకు నోటీసులు ఇవ్వడానికి మాత్రం గుంటూరుకు ఆగమేఘాలమీద వచ్చారని మండిపడ్డారు.

ఆనంద్ బాబుకు నోటీసులివ్వడంలోచూపిన మెరుపువేగం, గంజాయిసాగుని అరికట్టడంలో చూపితే బాగుండేదంటూ పోలీసులపై కొమ్మారెడ్డి పట్టాభి ఫైర్ అయ్యారు. పైస్థాయి అధికారులు చెప్పారు కదా అని, కిందిస్థాయిలో ఉన్న పోలీసులు శృతిమించి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారందరూ భవిష్యత్‌లో చట్టపరంగా, న్యాయపరంగా ఇబ్బందులు ఎదుర్కోకతప్పదని పట్టాభి హెచ్చరించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios